IPL 2025: ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్.. గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్!

Mumbai Indians vs Delhi Capitals Match in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆడిన 12 మ్యాచ్ల్లో ఏడింట గెలిచి 4వ స్థానంలో ఉంది. అలాగే ఢిల్లీ 12 మ్యాచ్ల్లో ఆరింట గెలిచి 5వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఇరు జట్లుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ ఏ జట్టు గెలిచినాప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫామ్ కానుంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది.
మరోవైపు, ఈ మ్యాచ్కు భారీ వర్ష సూచన ఉంది. ఇప్పటికే స్టేడియం పరిసర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ఈ మ్యాచ్ కష్టమేనని తెలుస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే ముంబై ఇండియన్స్కు 15 పాయింట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు 14 పాయింట్లతో 4, 5 స్థానాల్లో కొనసాగుతున్నాయి. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తన చివరి మ్యాచ్లో గెలుపొందడంతో పాటు ముంబై ఓటమి కోసం ఎదురుచూడాల్సి వస్తుంది.
ఒకవేళ, ముంబై చివరి మ్యాచ్ గెలిస్తే.. నేరుగా ముంబై ప్లే ఆఫ్స్ చేరకుంటుంది. కాగా, ఇరు జట్లు తమ చివరి మ్యాచ్లు పంజాబ్తోనే ఆడనున్నాయి. మరి ఈ ఉత్కంఠకు తెర పడాలంటే ఈ మ్యాచ్పై ఆధారపడి ఉంటుంది.
తుది జట్టు అంచనా:
ముంబై ఇండియన్స్: రికెల్టన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్, హార్దిక్(కెప్టెన్), విల్ జాక్స్, శాంట్నర్, చహర్, బోల్డ్, బుమ్రా.
ఢిల్లీ క్యాపిటల్స్: అభిషేక్ పోరెల్, డుప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్), స్టబ్స్, అశుతోష్ వర్మ, నిగమ్, ముస్తఫిజుర్, కుల్దీప్, ముకేశ్.