IPL 2025: రాజస్థాన్ చేతిలో చెన్నై ఘోర ఓటమి.. ఏకంగా పదో స్థానం!

Rajasthan Royals Won The Match Against Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో చెన్నైపై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే (43), బ్రెవిష్(42), దూబె(39), ధోనీ(16), కాన్వే(10) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ఆకాశ్, యుధ్వీర్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. తుషార్, హసరంగా తలో వికెట్ తీశారు.
189 పరుగుల లక్ష్యఛేదనను రాజస్థాన్ కేవలం 17.1 ఓవర్లలోనే పూర్తిచేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(36), వైభవ్57), శాంసన్(41), జురెల్(31) హెట్ మయర్(12) రాణించారు. కాగా, తొలి ఓవర్ నుంచే జైస్వాల్ దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత వైభవ్ కూడా భారీ షాట్లతో మెరిపించాడు. శాంసన్ కూడ తన దైన శైలిలో మెరిపించడంతో 13 ఓవర్లకే 134 పరుగులు చేసింది. వైభవ్.. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. చెన్నై బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు పడగొట్టగా.. అహ్మద్, అన్షుల్ చెరో వికెట్ తీశాడు.