Home / national
Madhya Pradesh : విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు తప్పుదొవ పట్టిస్తున్నారు. పిల్లలను చెడు అలవాట్లకు బానిసలుగా మార్చుతున్నారు. ఓ టీచర్ తన బాధ్యతను మరిచి విద్యార్థులకు మద్యం తాగించాడు. ఈ ఘటన సంచలనం రేపుతోంది. పాఠశాలలో విద్యార్థులకు దగ్గరుండి మద్యం పోసి వారు తాగేలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని కఠ్నీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బార్వారా బ్లాక్లోని ఖిర్హానీ గ్రామంలోని ప్రభుత్వ […]
Rohith Vemula Act : విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురావాలని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యావ్యవస్థలో కుల వివక్షను నిర్మూలనకు రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను కోరారు. ఈ సందర్భంగా రాహుల్ సీఎంకు లేఖ రాశారు. తన జీవిత కాలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కుల వివక్ష ఎదుర్కొన్నారని తన లేఖలో పేర్కొన్నారు. అంబేద్కర్ ఎదుర్కొన్న వివక్షను రాహుల్ తన లేఖలో […]
Maoists Surrender : ఛత్తీస్గఢ్లోని రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు. ఇందులో 12 మంది మావోయిసులపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. అమానవీయ మావోయిస్టు భావజాలం, గిరిజనులపై జరిగిన దురాగతాలతో నిరాశ చెందామని పేర్కొంటూ 9 మంది మహిళలు సహా 13 మంది మావోయిస్టులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ సీనియర్ అధికారుల ముందు లొంగిపోయారని సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు. […]
Unesco honour : మన భారతీయ సంస్కృతి, వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటుదక్కింది. విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని కొనియాడారు. 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్లో చోటు.. భారతీయ జ్ఞాన […]
Chai Reel : రోజురోజుకూ ఆకతాయిల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. రీల్స్ పిచ్చిలో ఏదీ పడితే అది చేస్తున్నారు. రీల్స్ చేసి అదే తమ సృజనాత్మకగా ఊహల్లో తేలిపోతున్నారు కొందరు. సోషల్ మీడియా వేదికగా లైకుల కోసం సామాజిక స్పృహ లేకుండా వ్యవహరిస్తున్న ఘటనలు కొకొల్లలు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో ఆకతాయి కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చుని టీ తాగుతూ రీల్ చేశాడు. ఈ ఘటన వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి […]
Visa Interview : అగ్రరాజ్యం అమెరికా పర్యటనకు ఓ భారతీయ యువడు వెళ్లాలని నిర్ణయించకున్నాడు. ఇంతలోనే అతడి ఆశలు క్షణాల్లోనే ఆవిరి అయ్యాయి. ఇంటర్వ్యూలో ఆ యువకుడు చెప్పిన సమాధానం వల్ల 40 సెకన్లలో వీసాను తిరస్కరించారు. ఈ విషయాన్ని అతడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఆవేదన వ్యక్తంచేశారు. నిజాయితీగా సమాధానం చెప్పినా తనకు వీసా ఇవ్వలేదని వాపోయాడు. అసలేం జరిగిందంటే..? రెడిట్లో Nobody 01810 అనే పేరుతో ఉన్న ఓ యూజర్ ఇటీవల […]
J D Vance : అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ ఈ నెల 21 భారత్ పర్యటనకు రానున్నారు. విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. జేడీ వాన్స్ ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఇటలీతోపాటు ఇండియాలో పర్యటించనున్నారు. ఆయన ఇరుదేశాల నేతలతో ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయాలపై చర్చిస్తారని ఉపాధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను సందర్శిస్తారని […]
Nitin Gadkari Shocking Comments on Delhi Weather: ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉండటంపై కేంద్రమంత్రి నితిక్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మూడు రోజులు ఉంటే జబ్బు చేయడం ఖాయమన్నారు. కాలుష్యంలో ఢిల్లీ, ముంబయి రెడ్జోన్లో ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రజల ఆయూష్ 10 ఏళ్లు తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశ ప్రజలు మేల్కొని వాహన ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. పర్యావరణాన్ని ఖ్యమైన విషయాల్లో […]
ED Issued Notice to Priyanka Gandhi husband Robert Vadra on Money Laundering Case: కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.7.5కోట్ల విలువైన మనిలాండరింగ్ వ్యవహారంలో వాద్రాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8న ఈడీ విచారణకు హాజరు కావాలంటూ వాద్రాకు నోటీసులు జారీ చేయగా, గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి వాద్రాకు నోటీసులు జారీ చేసింది. దీంతో […]
4km Perimeter Fence will be built around Ayodhya Ram Temple: యూపీలోని అయోధ్యలో రామాలయం చుట్టూ రక్షణగా నాలుగు కిలోమీటర్ల ప్రహరీని నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిర్మాణం 18 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు ఆలయ కమిటీ. శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్ర వెల్లడించారు. ప్రహరీని ఇంజినీర్స్ ఇండియా సంస్థ నిర్మిస్తుందని పేర్కొన్నారు. ప్రహరీ ఎత్తు, మందం, డిజైన్ విషయాలను ఫైనల్ చేశామని, మట్టి పరీక్షలు నిర్వహించిన తర్వాత పనులు […]