Home / national
External Affairs Ministry Spokesperson Randhir Jaiswal : ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాక్ పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇండియాతో సహా ప్రపంచ దేశాల్లోని అమాయకులను ఉగ్రవాదులు బలి తీసుకున్నారని పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు నిలిపివేసే వరకూ సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ అనంతరం పరిణామాలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. భారత్లో ఎలాంటి […]
Southwest Monsoon : గ్రీష్మం రుతువుతో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి చల్లని కబరు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతం ఇచ్చే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవనాల ఆగమనం దృష్ట్యా రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. రానున్న మూడు, నాలుగు రోజుల్లో.. రానున్న మూడు, నాలుగు రోజుల్లో […]
Sunil Gavaskar interesting comments : ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం టీమిండియాపైనే కేంద్రీకృతమై ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వారి స్థానాలను భర్తీ చేసేదెవరని చర్చ నడుస్తోంది. కొంతకాలంగా సంప్రదాయ ఫార్మాట్లో భారత జట్టు ఘోర పరాభవాలు చవిచూసింది. జూన్లో ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది. రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 ఆరంభం కానుంది. ఇంగ్లండ్ వేదికగా […]
Prime Minister Modi visits Dhampur Airbase : ప్రధాని మోదీ మంగళవారం అదంపూర్ ఎయిర్బేస్కు వెళ్లారు. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న సైనికులతో ముచ్చటించారు. పాక్పై అటాక్ చేయడంలో అదంపూర్ వైమానిక క్షేత్రం కీలకంగా నిలిచింది. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇవాళ మోదీ ఎయిర్బేస్కు వెళ్లి ఐఏఎఫ్ సిబ్బందితో మాట్లాడారు. అదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై పాక్ అటాక్ చేయాలని ప్రయత్నించింది. ఈ నెల 9వ తేదీ రాత్రి, 10న పాకిస్థాన్ […]
Prime Minister Modi Salutes to Indian Army: ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా మన సైన్యం చావుదెబ్బకొట్టిందని ప్రధాని మోదీ అన్నారు. సైనికులకు, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడారు. శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది.. గడిచిన నాలుగు రోజులుగా ఇండియా సైన్యం సామర్థ్యం, సంయమనాన్ని చూస్తున్నామని చెప్పారు. నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని భారత్ చూసిందన్నారు. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించిందని […]
India Pakistan DGMO Meeting: భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (డీజీఎంవో)ల చర్చలు ముగిశాయి. హాట్లైన్ ద్వారా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఇండియా డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. డీజీఎంవోల సమావేశం వాస్తవానికి ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు చర్చలు జరగాల్సి ఉండగా, సాయంత్రానికి వాయిదా పడ్డాయి. ఇరుదేశాల కాల్పుల విరమణ, ఉద్రిక్తతల తగ్గింపు, పీవోకే […]
PM Modi Address the Nation at 8 PM on Operation Sindoor: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రధాని మోదీ సోమవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూకశ్మీర్లోని పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్లో ఇండియా సైన్యం విజయం సాధించినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. తీవ్ర సస్పెన్స్ క్రియేట్ చేసిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ […]
Jasprit Bumrah Likely Drop from the test Captaincy: టెస్ట్ క్రికెట్కు రోహిత్ శర్మ ప్రకటించగా, ఈ రోజు విరాట్ కోహ్లీ ప్రకటించారు. నెక్ట్స్ కెప్టెన్ ఎవరనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. టీమిండియా జూన్లో ఇంగ్లండ్లో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతకుముందు వరకు నెక్ట్స్ సారథిగా బుమ్రా పేరు ఎక్కువగా వినిపించేది. గతంలో బుమ్రా మూడుసార్లు టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇంగ్లండ్తో ఒకసారి, బోర్డర్ […]
Congress leader KC Venugopal: భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగిన కాల్పుల విరమణకు తెరపడిన విషయం తెలిసిందే. తమ మధ్య వర్తిత్వంతోనే విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్రమంలో కశ్మీర్ అంశంపై అగ్రరాజ్యం అమెరికా ప్రమేయం ఉందా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటును అత్యవసరంగా సమావేశపర్చాలి.. మన దేశ విదేశీ […]
Sunny Joseph as Kerala Pradesh Congress Committee President: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడిని అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు కేరళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సన్నీ జోసెఫ్ను నియమించారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత కేరళ అధ్యక్షుడు కె.సుదర్శన్ జోసెఫ్కు బాధ్యతలు అప్పగించనున్నారు. ఎమ్మెల్యేలు పీసీ విష్ణునాథ్, ఏపీ అనిల్ కుమార్, ఎంపీ షరీఫ్ పరంబిల్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు […]