Published On:

Tamil Nadu : జాతీయ విద్యావిధానం.. మోదీ సర్కారుపై కోర్టుకెక్కిన తమిళనాడు ప్రభుత్వం

Tamil Nadu : జాతీయ విద్యావిధానం.. మోదీ సర్కారుపై కోర్టుకెక్కిన తమిళనాడు ప్రభుత్వం

National Education Policy : జాతీయ విద్యావిధానం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు సర్కారు మధ్య కొంతకాలంగా యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని ఎంకే.స్టాలిన్‌ సర్కారు ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తోంది. సూత్రం ప్రకారం, విద్యార్థులు ఇంగ్లిష్ ప్రాంతీయ భాషతోపాటు మూడో భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది.

 

హిందీ భాషను బలవంతంగా రుద్దుతోంది..
జాతీయ విద్యావిధానం ముసుగులో కేంద్ర ప్రభుత్వం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని తమిళ సర్కారు మండిపడుతోంది. ఈ అంశంలో ఎంకే.స్టాలిన్‌ సర్కారు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జాతీయ విద్యావిధానం అమలు చేయడం లేదన్న కారణంతో కేంద్రంలోని మోదీ సర్కారు తమ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,151 కోట్ల నిధులను నిలిపి వేసిందని కోర్టుకు తెలిపింది. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేసింది.

 

నిధులను నిలిపివేసిన కేంద్రం..
పాఠశాల విద్యకోసం ఉద్దేశించిన సమగ్ర శిక్ష పథకం అవసరాలకు అనుగుణంగా తమిళనాడు ఉందని కేంద్రం తెలిపింది. గతేడాది ఫిబ్రవరి 16వ తేదీన జరిగిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో కేంద్ర ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్‌లో ప్రస్తావించింది. తర్వాత పథకం కింద ఖర్చు కోసం రూ.3,585.99 కోట్ల నిధుల కేటాయింపు జరిగిందని పేర్కొంది. 60:40 నిష్పత్తి ప్రకారం కేంద్రం వాటా రూ.2,151 కోట్లు అని తెలిపింది. నిధులు గతేడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రానికి చెల్లించాల్సి ఉందని తెలిపింది. జాతీయ విద్యా విధానం అమలు చేయడం లేదన్న కారణంతో నిధులను కేంద్రం నిలిపివేసిందని పిటిషన్‌లో వివరించింది.

ఇవి కూడా చదవండి: