PSBK vs RR: రాజస్థాన్ పై పంజాబ్ గెలుపు

Breaking News : 220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనర్లు రాణించినా ఓటమిని తప్పించుకోలేకపోయారు. 10 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ కు దిగింది. పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లలో ఐదువికెట్ల నష్టానికి 219పరుగులు చేసింది.
పంజాబ్ బాటర్లలో నెహాల్ వడారా 37బంతుల్లో 70పరుగులు చేశాడు. శషాంక్ సింగ్ 30 బంతుల్లో 59 పరుగులు చేయగా కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ 25 బంతుల్లో 30 పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి పంజాబ్ టాప్ ఆర్డర్ చతికిల పడింది. ఒక రకంగా 34 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది పంజాబ్. నెహాల్ 37 బంతుల్లో 70 పరుగులు చేసి వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ప్రియాంధ్ ఆర్య 9, ఒచెల్ 0 విఫలమయ్యారు.
లక్ష్య చేధనలో రాజస్థాన్ రాయల్స్ శుభారంభాన్ని ఇచ్చారు. ఎప్పటిలాగే సూర్యవంశీ 15 బంతుల్లో 40 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ జైస్వాల్ 25బంతులకు 50పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్ లో సంజూ శాంసన్ వచ్చి 16 బంతులకు 20 పరుగులు. రియాన్ పరాగ్ 11 బంతుల్లో 13పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన ద్రువ్ 31 బంతుల్లో 53పరుగులు చేయడంతో విజయం సాధ్యమేననుకున్నారు. కానీ చివరి ఓవర్లో 22 పరుగులు చేయాల్సి ఉండగా 12 పరుగులే చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ 3 వికెట్లు తీశాడు. జాన్సన్, అజ్మతుల్లా చెరో రెండు వికెట్లను పడగొట్టారు.