Published On:

Air India Plane Crash : గుజరాత్ మాజీ సీఎంతో సహా విమానంలో 242 మంది మృతి : అహ్మదాబాద్‌ సీపీ

Air India Plane Crash : గుజరాత్ మాజీ సీఎంతో సహా విమానంలో 242 మంది మృతి : అహ్మదాబాద్‌ సీపీ

Air India : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. మేఘనినగర్ సమీపంలో ఓ మెడికల్ కళాశాల భవనంపై క్రాష్ అయ్యింది. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. లండన్‌ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానంలో 242 ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 242 మంది మృతి చెందినట్లు సమాచారం. విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారని, విమానంలో ఉన్నవారందరూ బతికి ఉండే అవకాశం లేదని అహ్మదాబాద్‌ సీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ తెలిపారు.

 

మృతుల్లో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్‌ పౌరులు, ఒకరు కెనడా దేశస్తుడు ఉన్నారు. మృతుల్లో 217 మంది పెద్దవాళ్లు, 11 మంది పిల్లలు, ఇద్దరు పసివాళ్లు ఉన్నారు. ప్రమాదంలో 169 మంది భారతీయులు మృతి చెందారు.

 

గుజరాత్ మాజీ సీఎం మృతి..
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతిచెందారు. విషయాన్ని అధికారులు నిర్ధారించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విజయ్ 2016 నుంచి 2020 వరకు గుజరాత్ సీఎంగా పనిచేశారు.

ఇవి కూడా చదవండి: