Air india Flight Crash : ‘ఎక్స్’లో నలుపు రంగు డీపీతో ఎయిర్ ఇండియా సంతాపం

Air India condoles : అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. దీంతో ఎయిర్ ఇండియా సంస్థ ‘ఎక్స్’లో అధికారిక ఖాతాలో డీపీ మార్చింది. బాధితులకు సంతాపం తెలుపుతూ నలుపు రంగు డీపీ పెట్టింది.
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా ఏఐ-171 విమానం కాసేపటికే కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు.
ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.