Published On:

KKR Vs RR: నరాలు తెగే ఉత్కంఠ.. ఒక్క పరుగుతో కోల్ కతా గెలుపు

KKR Vs RR: నరాలు తెగే ఉత్కంఠ.. ఒక్క పరుగుతో కోల్ కతా గెలుపు

IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఇవాళ జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 95 పరుగులతో రాజస్థాన్ కెప్టెన్ పూరన్ చేసిన పోరాటం వృథా అయిపోయింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేసింది.

కాగా కోల్ కత్తా నిర్దేశించిన లక్ష్యఛేదనలో రాజస్థాన్ కు మొదటి ఓవర్ లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 4 పరుగులకే ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన కునాల్ సింగ్ రాథోడ్ డకౌట్ గా వెనుతిరిగాడు. ఇక జైశ్వాల్, రియాన్ పరాగ్ ఇద్దరూ కలిసి పవర్ ప్లే ముగిసేవరకు 59 పరుగులు చేశారు. తర్వాత కథ మళ్లీ మొదటికి వచ్చింది. జైశ్వాల్ (34) ఔట్ కాగా.. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి మరో ఇద్దరిని ఔట్ చేసి రాజస్థాన్ కోలుకోని విధంగా దెబ్బతీశాడు. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ కనీసం 20 ఓవర్లు ఆడుతుందా అని అంతా అనుకున్నారు. కానీ హెట్ మేయర్ తో కలిసి పరాగ్ వీరవిహారం చేశాడు. వీరిద్దరూ కలిసి 92 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి రాజస్థాన్ ను మళ్లీ పోటీలోకి తీసుకువచ్చాడు. చివర్లో హెట్ మేయర్, పరాగ్ అవుట్ కాగా.. కేకేఆర్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ బౌలర్లలో మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు తీసుకోగా.. వైభవ్ అరోరాకు ఓ వికెట్ దక్కింది.