Published On:

RR Vs MI: రాణించిన ప్లేయర్లు.. ముంబై భారీ స్కోర్

RR Vs MI: రాణించిన ప్లేయర్లు.. ముంబై భారీ స్కోర్

IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. జైపూర్ లోని మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ముంబై జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు రికెల్ టన్ (61), రోహిత్ శర్మ (53) మెరుపులకు తోడు.. సూర్యకుమార్ యాదవ్ (48), హార్దిక్ పాండ్యా (48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో తీక్షణ, పరాగ్ కు చెరో వికెట్ దక్కింది.

కాగా ముంబై బ్యాటింగ్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ, రికెల్ టన్ కలిసి ఫస్ట్ వికెట్ కు 116 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫోర్లు, సిక్సులు బాదుతూ రాజస్థాన్ బౌలర్లను హడలెత్తించారు. పవర్ ప్లే ముగిసేవరకు ముంబై 58 పరుగులు చేసింది. తర్వాత రోహిత్ శర్మ, రికెల్ వెంట, వెంటనే ఔటయ్యారు. అయినా బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కూడా అదే జోరు కొనసాగించారు. వీరిద్దరి బ్యాటింగ్ లో రాజస్థాన్ బౌలర్లు తేలిపోయారు. బ్యాటింగ్ ముగిసే సమయానికి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.