RCB Vs KKR: ఐపీఎల్ ఫ్యాన్స్ కు నిరాశ.. కోల్ కతాకు ఎదురుదెబ్బ

IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా క్రికెట్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగింది. భారత్- పాక్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను రీషెడ్యూల్ చేశారు. తాజాగా నిన్నటి నుంచి మ్యాచ్ లు ప్రారంభంకావాల్సి ఉంది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో నిన్న బెంగళూరు- కోల్ కతా మధ్య మ్యాచ్ జరగాల్సి ఉన్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఎంతో ఆశతో వచ్చిన ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో కోల్ కతా ఓడిపోయి.. ఇంటి బాట పట్టింది.
దీంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ దక్కింది. ఇక 13 మ్యాచ్ ల్లో 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న కేకేఆర్ సిరీస్ నుంచి వైదొలిగింది. ఇప్పటికే చైన్నై, హైదరాబాద్, రాజస్తాన్ జట్లు ప్లేఆఫ్స్ నుంచి తప్పుకోగా.. తాజాగా కోల్ కతా ఆ జాబితాలో చేరింది. ఇక 12 మ్యాచ్ ల్లో 17 పాయింట్లతో ఆర్సీబీ టాప్ ప్లేస్ కి దూసుకెళ్లి ప్లే ఆఫ్స్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకుంది.
ఇక టెస్ట్ ఫార్మెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ ఆడుతున్న తొలి మ్యాచ్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ భారీగా స్టేడియానికి తరలివచ్చారు. విరాట్ నెంబర్ జెర్సీని ధరించి సందడి చేశారు. థ్యాంక్యూ విరాట్ అనే బ్యానర్లు ప్రదర్శించారు. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం ప్రారంభమైనా అక్కడే వేచి చూశారు. చివరకు రాత్రి 10.20 గంటలకు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.