Home /Author Mallikanti Veerabhadram
Atishi Marlena: దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఆప్ సీనియర్ నేత, మాజీ సీఎం అతిశి నియోజకవర్గమైన కల్కాజీలోని గోవింద్ పురి జుగ్గి క్లస్టర్ లో అక్రమంగా నిర్మించిన 1200కు పైగా గుడిసెలను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు. కాగా ప్రభుత్వ తీరుపై ఆప్ నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ పేదల వ్యతిరేక ప్రభుత్వమని మాజీ సీఎం అతిశి ఆరోపించారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలు కూల్చివేసినట్టు […]
Hall Tickets: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. టెట్ పరీక్షకు అప్లై చేసిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేది వివరాలు అఫిషియల్ వెబ్ సైట్ లో నమోదు చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా టెట్ పరీక్షలు జూన్ 18 నుంచి ఆన్ లైన్ లో జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా.. ఉదయం 9 గంటల నుంచి 11.30 మొదటి సెషన్, మధ్యాహ్నం 2 […]
Donald Trump: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళన చెందుతున్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేయబోతుందని ఇప్పటికే అమెరికా హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్, ఇరాక్ లో ఉన్న తమ వారంతా ఖాళీ చేయాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. కాగా పశ్చిమాసియా ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమని.. తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. దీంతో ఇరాన్ లో ఏదో జరగబోతుందన్న సంకేతాలు […]
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు వర్గాల ప్రజలు విధ్వంసానికి దిగడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మిటాబ్రుజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రబీంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహేస్తల ప్రాంతంలో నిర్మించిన శివాలయాన్ని కొందరు ధ్వంసం చేశారు. ఆక్రమిత ప్రాంతంలో కొందరు షాపులు ఏర్పాటు చేయడంతో గొడవ జరిగింది. వివాదాస్పద భూమి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. రెండు […]
Sajjala Ramakrishna Reddy: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ తాజాగా ఓ పుస్తకాన్ని రిలీజ్ చేసింది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రంలో జరిగిన స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి “జగన్ అంటే నమ్మకం- చంద్రబాబు అంటే మోసం” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీతో పాటు పలువురు ముఖ్య నేతలు […]
Gender Parity: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ సర్వేకు సంబంధించిన రిపోర్ట్ ను విడుదల చేసింది. అందులో భాగంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 రిపోర్ట్ ప్రకారం భారత్ 131 స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 పైగా దేశాల్లో సర్వే చేయగా 64.1 శాతం స్కోర్ తో భారత్ ఈ స్థానంలో నిలిచింది. దక్షిణాసియాలో నమోదైన అత్యల్ప స్కోర్ లో ఇది ఒకటి. అయితే గతంతో పోలిస్తే భారత్.. […]
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. మొన్నటి వరకు వర్షాల జాడలేక ఎండలు ఠారెత్తించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఎండలకు అల్లాడిపోయారు. తాజాగా వాతావరణం మారిపోయింది. రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడేందుకు వాతావరణం అనుకూలంగా మారింది. నైరుతి రుతుపవనాల కదలిక, అలాగే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. వచ్చే రెండు రోజులపాటు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు […]
Pahalgam Attack: జమ్ముకాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పాక్ ప్రేరేపిత, నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించి అమాయకపు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత ప్రభుత్వం కూడా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై పాకిస్తాన్ కు గట్టి బదులివ్వాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే పాక్ ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టింది. ఆ […]
Devotees Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు మగిసి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించినా.. భక్తులు ఇంకా పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తూనే ఉన్నారు. దీంతో భక్తులతో తిరుమల కొండ రద్దీగా మారింది. ఎక్కడ చూసినా భక్తుల జన సందోహం కనిపిస్తోంది. ఇక స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల నారాయణగిరి షెడ్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనం భక్తులకు స్వామివారి […]
Narayanapet: నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మక్తల్ మండలం బొందల్ కుంట- జక్లేర్ గ్రామల సమీపంలో 167వ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఏడుగురిని రాయచూర్ కి, మిగిలిన వారిని మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి ట్రావెల్ బస్సు డ్రైవర్ […]