Published On:

Manchu Vishnu: నా గుండె పగిలింది.. మంచు విష్ణు కీలక నిర్ణయం

Manchu Vishnu: నా గుండె పగిలింది.. మంచు విష్ణు కీలక నిర్ణయం

Manchu Vishnu Announced Kannappa Trailer Launch Postpone: హీరో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు ఇండోర్‌ జరగాల్సిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆకస్మాత్తుగా వాయిదా వేసింది టీం. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ మంచు విష్ణు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గుజరాత్‌ ఆహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాఫ్‌ అయిన ఏడు నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో ప్లైయిట్‌లో 242 మంది ప్రయాణికులు ఉన్నారు.

 

అందులో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపాని కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రయాణికుల్లో 11 మంది చిన్నపిల్లలు, ఇద్దరు పసిబిడ్డలు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా చనిపోయి ఉంటారని అనుమానిస్తుంది. ఈ ప్రమాద ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనిపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ మృతులకు సంతాపం తెలుపుతున్నారు. ఈ ప్రమాదంపై హీరో మంచు విష్ణు సైతం స్పందించారు. ఎయిరిండియా ప్రమాదం తెలిసి నా గుండె పగిలిపోయింది అంటూ అవేదన వ్యక్తం చేశారు.

 

“ఎయిరిండియా విమాన ప్రమాదం గురించి తెలియగానే నా గుండె పగిలిపోయింది. ఈ ఘటన నన్నేంతో బాధిస్తోంది. రేపు విడుదల చేయాల్సిన కన్నప్ప ట్రైలర్‌ ఒక రోజుకి వాయిదా వేస్తున్నాం. అలాగే రేపు ఇండోర్‌ జరగాల్సిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని కూడా క్యాన్సిల్‌ చేసి.. ఎల్లుండి ప్లాన్‌ చేశాం. ఈ కష్ట సమయంలో నా ప్రార్థనలు బాధిత కుటుంబాలకు ఉంటాయని, వారికి దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా” అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. కాగా మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ సినిమాను ఎన్నో వాయిదాల అనంతరం జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

ప్రమోషన్స్‌లో భాగంగా రేపు ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటన ఇచ్చింది. అలాగే రేపే ఇండోర్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని కూడా గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనే కన్నప్ప ట్రైలర్‌ విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. ఈ సమయంలో హఠాత్తుగా జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదం కారణంగా ట్రైలర్‌ రిలీజ్‌తో పాటు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ క్యాన్సిల్‌ చేస్తున్నట్టు మంచు విష్ణు ప్రకటన ఇచ్చాడు. ఆయన నిర్ణయంపై నెటిజన్స్‌ హర్షం వ్యక్త చేస్తున్నారు.