Published On:

LSG Vs RCB: ఆర్సీబీ లక్ష్యం 228.. సెంచరీ చేసిన పంత్!

LSG Vs RCB: ఆర్సీబీ లక్ష్యం 228.. సెంచరీ చేసిన పంత్!

LSG vs RCB Updates: హమ్మయ్య ఎట్టకేలకు రిషబ్ పంత్ బ్యాట్ కు పనిచెప్పాడు. ఐపీఎల్ 2025 లో ఇప్పటివరకు పంత్ చెప్పుకోలేని స్కోర్ చేయడంతో విమర్శలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు కాస్తా ఆర్సీబీపై ఏకంగా సెంచరీ చేశారు. ఐపీఎల్ 18వ సీజన్ ముగియడానికి ఇంకో నాలుగు మ్యాచ్ లు బాకీ ఉన్నాయి. 74 మ్యాచులలో ఇది 70వ మ్యాచ్. ఇది ఉత్తర్ ప్రదేశ్ లోని ఎకానా స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది.

 

టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్ణిత 20 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 227పరుగులు చేసింది. ఓపెనర్లలో మిచెల్ 37 బంతుల్లో 67 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ మ్యాథ్యూ 12 బంతుల్లో 14పరుగులకే పెవిలియన్ చేరాడు. ఫస్ట్ డౌన్ లో దిగిన పంత్ ఎప్పటిలాగే నిరాశపరుస్తాడని అందరూ బావించినా తన బ్యాటుతోనే సమాదానం చెప్పాడు. 61బంతులాడిన పంత్ ఏకంగా 118పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పూరన్ 10 బంతుల్లో 13, సమద్ 1 బంతికి 1 నాటౌట్ గా నిలిచాడు. దీంతో లక్నో నిర్ణిత 20 ఓవర్లలో 227పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో తుషారా, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ చెరో వికెట్ తీసుకున్నారు.

 

ఇవి కూడా చదవండి: