Published On:

GT Vs MI: క్వాలిఫయర్-2 కి ముంబై.. రసవత్తరంగా మ్యాచ్

GT Vs MI: క్వాలిఫయర్-2 కి ముంబై.. రసవత్తరంగా మ్యాచ్

IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ పై ముంబై విజయం సాధించింది. నిన్న పంజాబ్ లోని ఛండీగఢ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై 20 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ సాయి సుదర్శన్ 49 బంతుల్లో 80, సుందర్ 24 బంతుల్లో 48 పరుగులతో గుజరాత్ విజయంపై ఆశలు కల్పించినా కీలక దశలో వికెట్లు కోల్పోవడంతో ముంబై విజయాన్ని అందుకుంది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 50 బంతుల్లో 81 హాఫ్ సెంచరీతో రాణించాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్, బెయిర్ స్టో కూడా మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్, ప్రసిద్ కృష్ణ రెండేసి వికెట్లు తీసుకున్నారు. సిరాజ్ కు ఓ వికెట్ దక్కింది.

 

ఇక 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు మొదటి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. బోల్ట్ బౌలింగ్ లో గిల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. ఈ దశలో కుశాల్ మెండీస్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు. ముంబై బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో పవర్ ప్లే ముగిసే వరకు వికెట్ నష్టానికి గుజరాత్ 66 పరుగులు చేసింది.

 

ఏడో ఓవర్ లో మెండీస్ కాలు వికెట్లకు తగలడంతో హిట్ వికెట్ రూపంలో ఔటయ్యాడు. అయినా సాయి సుదర్శన్, వాషింగ్ టన్ సుందర్ జట్టును విజయం వైపు తీసుకెళ్లారు. ఇక 14 ఓవర్లో సుందర్ కూడా ఔటవ్వడంతో మ్యాచ్ నెమ్మదిగా ముంబై వైపునకు మళ్లింది. కాగా మూడో వికెట్ కు వీరిద్దరూ కలిసి 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వికెట్లు పడుతున్న మరోవైపు సాయి సుదర్శన్ అద్భుతంగా రాణించాడు. అనంతరం 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గ్లేస్సన్ బౌలింగ్ సాయి సుదర్శన్ కూడా వెనుదిరిగాడు. దీంతో ముంబై విజయం దాదాపు ఖాయమైంది. చివర్లో రూథర్ పోర్డ్, తెవాటియా పోరాటినా గుజరాత్ కు ఓటమి తప్పలేదు. ఇక ముంబై బౌలర్లలో బోల్ట్ రెండు వికెట్లు తీసుకోగా, బుమ్రా, గ్లేస్సన్, సాంటర్న్, అశ్వనికుమార్ తలో వికెట్ పడగొట్టారు. దీంతో ముంబై క్వాలిఫయర్- 2 కి వెళ్లగా.. గుజరాత్ ఇంటి ముఖం పట్టింది.