Published On:

PSBK vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

PSBK vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

Breaking News: PSBK vs MI: IPL 2025:  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పంజాబ్. ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్న పంజాబ్ తన బ్యాటింగ్ లైనప్ ను నమ్ముకుంది. అందులో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ ముందుగా ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

 

క్వాలిఫయర్ 2 లో పంజాబ్ ముంబై తలపడనుంది. ఇందులో గెలిచిన టీం ఫైనల్ లో ఆర్సీబీతో ఆడనుంది. ఈ మ్యాచ్ పై ఇటు పంజాబ్ అటు ముంబై ఇండియన్స్ ఎలాగైనా గెలవాలన్న కసిపై ఉన్నాయి. ఇప్పటికే ఐదు ఐపీఎల్ ట్రోఫీలను గెలిచిన ముంబై తాజాగా ఆరవ ట్రోఫీ గెలవాలన్న కసిపై ఉంది. పంజాబ్ మాత్రం తొలి ఐపీఎల్ ట్రోఫీ గెలవాలన్న పట్టదల కనిపిస్తోంది. ఇందులో గెలిచిన జట్టు ఆర్సీబీతో ఫైనల్ లో తలపడనుంది.

 

 

అహ్మదాబాద్ లోని మోడీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. గత మూడు మ్యాచులకు దూరంగా ఉన్న పంజాబ్ స్పిన్నర్ చాహల్ ఈ మ్యాచ్ కు అందుబాటులోకి వచ్చాడు. ముంబై స్టార్ బ్యాటర్ రాహిత్ శర్మ భారీ రికార్డును అందుకునే అవకాశం ఈ మ్యాచ్ లో ఉంది. ఇంకో 3 సిక్సులను కొడితే టీ20 క్రికెట్ లో 550 సిక్సులు కొట్టిన క్రొకెటర్ గా భారత ఆటగాడిగా నిలుస్తాడు.

 

పంజాబ్ జట్టు… ప్రియాంశ్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ ( వికెట్ కీపర్). శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), నేహల్, మార్కూస్, శషాంక్ సింగ్, అజ్మతుల్లా, కైల్ జేమిసన్, విజయ్ కుమార్, చాహల్, అర్శదీప్ సింగ్

ముంబై జట్టు… రోహిత్ శర్మ, జానీ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్డిక్ పాండ్యా, నమన్, మిచెల్, రాజ్ బవ, బోల్ట్, బుమ్రా, రీస్ టోప్లీ

 

 

కాకినాడకు కొత్త శోభ సంతరించుకుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ప్రాంగణంలో ఐపీఎల్ మ్యాచ్ లు తిలకించేందుకు బిగ్ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. కాకినాడ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు.. BCCI ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ క్రీడా ప్రాంగణంలో ఐపీఎస్ మ్యాచ్ లకు బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. కాకినాడలోని ఐపీఎల్ మ్యాచ్ నిర్వహిస్తున్నంత ఫీల్ ఉందని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు. భారీ ఎత్తున క్రికెట్ అభిమానులు స్టేడియంకు చేరుకున్నారు.

 

 

 

ఇవి కూడా చదవండి: