Published On:

India Pakistan War: భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. యుద్ధం వస్తే ఏం చేయాలో తెలుసా..?

India Pakistan War: భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. యుద్ధం వస్తే ఏం చేయాలో తెలుసా..?

India Pakistan War Tensions on the Border: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ప్రభుత్వ సంస్థలకు ఎలా సహకరించాలి? యుద్ధం సమయంలో మన కర్తవ్యాలు ఏంటి? ముందస్తుగా ఇలాంటి విషయాలపై ప్రజలకు అవగాహన చాలా అవసరం. ప్రజల భద్రత, సమాజ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ భద్రతా సంస్థల సూచనల ఆధారంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

 

యుద్ధం.. అత్యంత అరుదైన, తీవ్రమైన పరిస్థితి. ఈ సమయంలో సామాన్యప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలను పాటించడం, సమాజ సామరస్యాన్ని కాపాడడం, స్వీయ రక్షణ చర్యలను తీసుకోవాలి. శాంతి, సమైక్యతను ప్రోత్సహించడం మన ప్రధాన కర్తవ్యం. యుద్ధ పరిస్థితులనే మఠం ఎదుర్కోవలసి వస్తే అత్యవసర ఏర్పాట్లు చాలా చేసుకోవాల్సి ఉంటుంది. ఆహారం, నీరు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు నెల రోజులకు సరిపడా మందులు, అత్యవసరంగా ఉపయోగపడే టార్చ్, బ్యాటరీ, పవర్ బ్యాంకు లాంటివి ముందుగా ఏర్పాటు చేసుకుంటే మంచిది.

 

అంతేకాకుండా ఆహారం, నీరు కనీసం వారం నుంచి రెండు వారాలకు సరిపడా ఉండాలి. నీటిని సురక్షితమైన కంటైనర్లలో భద్రపరచాలి. అలాగే కుటుంబ సభ్యులకు అవసరమైన ఔషధాలను కనీసం ఒక నెల రోజులకు సరిపడేలా ఉంచుకోవాలి. యుద్ధ సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కావున ఫస్ట్ ఎయిడ్కెట్ సంబంధించినవి ముందస్తుగా బ్యాండేజీలు, యాం టీసెప్టిక్ క్రీమ్, నొప్పి నివారణ మాత్రలు, థర్మామీటర్ కిట్ సిద్ధం చేసుకోవాలి. శాటిలైట్ ఛానల్స్, ఇంటర్నెట్ లాంటివి పనిచేయకపోవచ్చు. అందువల్ల యుద్ధ సమాచారం, ప్రభుత్వం, భద్రతా సంస్థలు అందించే సూచనలు తెలుసుకోవడానికి రేడియో చాలా ఉపయోగపడుతుంది.

 

ఇంటిలో బయటి గోడలకు దూరంగా, బలమైన నిర్మాణం ఉన్న ప్రదేశాన్ని సురక్షిత ప్రాంతంగా ఎంచుకోవాలి. అలాగే ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాంబు షెల్టర్లు లేదా సురక్షిత ప్రాంతాల సమాచారం ముందుగానే తెలుసుకోవాలి. సరిహద్దు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఆదేశాల మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. రేడియో, టీవీ, మొబైల్ అలర్ట్ల ద్వారా ప్రభుత్వం జారీ చేసే హెచ్చరికలను నిరంతరం గమనించాలి.

 

రద్దీ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులను గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా హెల్ప్ లైన్ నంబర్ కు సమాచారం అందించాలి. కుటుంబ సంప్రదింపు ప్రణాళిక కుటుంబ సభ్యులతో అత్యవసర సంప్రదింపు ప్రణాళిక రూపొందించండి. ఒకవేళ కమ్యూనికేషన్ వ్యవస్థలు విఫలమైతే, కలిసేస్థలా న్ని ముందుగా నిర్ణయించండి. అలాగే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మాల్స్, సినిమా హాళ్లు వంటి రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిది. పిల్లలను పాఠశాలల నుంచి తీసుకురావడానికి లేదా కార్యాలయాల నుంచి ఇంటికి తిరిగి రావడానికి సురక్షిత మార్గాలను ఎంచుకోండి. సైనిక సరిహద్దు ప్రాంతాలకు దూరంగా ఉండాలి. సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, రైల్వే జంక్షన్లు, సరి హద్దు ప్రాంతాలకు దూరంగా ఉండండి. ఈ ప్రాంతాలు యుద్ధ సమయంలో లక్ష్యంగా మారే అవకాశం ఉంది.

 

ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దు. అధికారిక వార్తా సంస్థలైన డీడీ న్యూస్, ఆల్ ఇండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి సమా చారాన్ని పొందండి. మతం, కులం, ప్రాంతం ఆధారంగా విభజన సృష్టించే సందేశాలను వ్యతిరేకించాలి. దేశ ఐక్యతకు మద్దతు ఇవ్వాలి. పిల్లలు, వృద్ధులతో శాంతితో మాట్లాడి భయాన్ని తగ్గించాలి.