Published On:

Manchu Lakshmi on Plane Crash: అహ్మదాబాద్‌ ఘటన, ఎయిరిండియా విమానంలో మంచు లక్ష్మి – క్షేమంగానే ఉన్నాను..

Manchu Lakshmi on Plane Crash: అహ్మదాబాద్‌ ఘటన, ఎయిరిండియా విమానంలో మంచు లక్ష్మి – క్షేమంగానే ఉన్నాను..

Manchu Lakshmi Travel in Air India Flight to London: అహ్మదాబాద్‌ ఎయిరిండియా ప్లైయిట్ ఘటనకు యావత్‌ దేశం ఉలిక్కిపడింది. ఈ ప్రమాదం వందల మంది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. గుజరాత్‌ అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాల్లోనే ఎయిరిండియా విమానం కుప్పకూలిపోయింది. ఓ మెడికల్‌ కాలేజ్‌ బిల్డింగ్‌పై కూలడంతో అందులోని వైద్యులు, సిబ్బంది, మెడికల్‌ స్టూడెంట్స్‌ సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన 260పైగా మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

 

అదే రోజు ఎయిరిండియా ప్లైయిట్‌లో సినీ నటి మంచు లక్ష్మీ కూడా ప్రయాణించారట. ఆమె కూడా లండన్‌కు బయలుదేరారు. కేవలం మంచు లక్ష్మి మాత్రమే కాదు ఆమె కూతురు, భర్త కూడా ఉన్నారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే అంత ఆమెకు కాల్‌ చేశారట. విమానంలో ఉండటం వల్ల ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు. దీంతో ప్రతి ఒక్కరు ఆమె గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు మంచు లక్ష్మి ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. అలాగే వీడియో కూడా రిలీజ్‌ చేసింది.

 

“విమాన ప్రమాదం జరిగిన రోజే నేను కూడా ఎయిరిండియా ప్లైట్‌లో ప్రయాణించిన మాట వాస్తవమే. కానీ, నేను ముంబై నుంచి లండన్‌ వెళ్లాను. నాతో పాటు నా కూతురు కూడా ఉంది. లండన్‌లో దిగగానే నాకు అహ్మదాబాద్‌ ఎయిరిండియా ప్లైట్‌ ఘటన గురించి తెలిసింది. ఈ వార్త వినగానే నా మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఈ ఘటనలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది నిజంగా బాధాకరమైంది.

 

అదే రోజు నేను కూడా ఎయిరిండి విమానంలో ప్రయాణించాననే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఈ రోజును ఊహించుకోవడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. ఈ ఘటన ప్రయాణికులు మాత్రమే కాదు రెసిండెంట్‌ డాక్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారని విని నా గుండె పగిలింది. జీవితం ఎంత విచిత్రమైంది. మన ప్రాణాల క్షణంలో ఎలా ముగిసిపోతాయి అనేది ఇదోక ఉదాహరణ. ఇలాంఇ ప్రమాదాలు జరిగినప్పుడే మనమేంటో అర్థం అవుతుంది. బాధిత కుటుంబాలందరికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా” అంటూ రాసుకొచ్చింది.