Published On:

World Economic Forum: గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025.. పడిపోయిన ఇండియా ర్యాంక్

World Economic Forum: గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025.. పడిపోయిన ఇండియా ర్యాంక్

Gender Parity: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ సర్వేకు సంబంధించిన రిపోర్ట్ ను విడుదల చేసింది. అందులో భాగంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 రిపోర్ట్ ప్రకారం భారత్ 131 స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 పైగా దేశాల్లో సర్వే చేయగా 64.1 శాతం స్కోర్ తో భారత్ ఈ స్థానంలో నిలిచింది. దక్షిణాసియాలో నమోదైన అత్యల్ప స్కోర్ లో ఇది ఒకటి. అయితే గతంతో పోలిస్తే భారత్.. ఇంకా రెండు స్థానాలు దిగజారిపోయింది. 2024 లో ఇదే రిపోర్ట్ లో భారత్ 129వ స్థానంలో ఉండగా.. తాజాగా 131 ర్యాంక్ సాధించింది. దక్షిణాసియాకు చెందిన దేశాల్లో బంగ్లాదేశ్ (24వ ర్యాంక్)తో మెరుగైన స్థితిలో ఉంది. అలాగే భారత్ కంటే ముందు భూటాన్ (119), నేపాల్ (125), శ్రీలంక (130) సాధించాయి. మాల్దీవులు, పాకిస్తాన్ మాత్రం భారత్ కంటే మరింతగా వెనుకబడ్డాయి.

 

అయితే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం ఐస్ లాండ్ 92.6 శాతం మార్కులతో వరుసగా 16వ సారి ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ప్రపంచంలో ఎక్కువగా జెండర్- సమాన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా నిలిచింది. ఇందులో ఆర్థిక వ్యవహారాల్లో మహిళల భాగస్వామ్యం, విద్యా, ఉద్యోగాల్లో సమానత్వం, ఆరోగ్యం, జీవితం, రాజకీయ సాధికరతలో మహిళల స్థానం వంటి అంశాలపై సర్వే నిర్వహించింది.

 

అయితే తాజాగా ప్రకటించిన ర్యాంక్ లో మహిళలకు ఆర్థిక వ్యవహారాల్లో అవకాశం కల్పించడంపై పురోగతి సాధించింది. అలాగే విద్యలో సమానత్వం మెరుగుపడింది. అాగే ఆరోగ్యం, జీవన రంగంలో కూడా స్వల్ప మెరుగుదల కనిపించింది. కానీ రాజకీయ సాధికారతలో మాత్రం భారత్ వెనుకబడిపోయింది. భారత పార్లమెంట్ లో మహిళల ప్రాతినిధ్యం 14.7 నుంచి 13.8 శాతానికి తగ్గింది. అయితే ఆర్థిక, విద్యా, ఆరోగ్య రంగాల్లో సమానత్వం పురోగతిలో ఉన్నప్పటికీ రాజకీయ సాధికారతో భారత్ వెనుకబడటం ఎదురుదెబ్బగా మారింది.