Published On:

Jaishankar: ఉగ్రవాదులకు రక్షణగా పాక్.. మంత్రి జైశంకర్ వ్యాఖ్యలు

Jaishankar: ఉగ్రవాదులకు రక్షణగా పాక్.. మంత్రి జైశంకర్ వ్యాఖ్యలు

Operation Sindoor: ఉగ్రవాదులకు రక్షణగా పాకిస్తాన్ పనిచేస్తుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. బ్రస్సెల్స్ వేదికగా జరిగిన కార్యక్రమంలో దాయాది దేశంపై విమర్శలు చేశారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని అన్నారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్య కంటే ఉగ్రవాదమే పెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు.

 

యూరోపియన్ యూనియన్ నేతలను కలిసేందుకు బ్రస్సెల్స్ వెళ్లిన మంత్రి జైశంకర్ అక్కడ మాట్లాడారు. భారత్- ఈయూ బంధం భవిష్యత్తులో మరింత బలపడుతుందని తాను అశిస్తున్నానని తెలిపారు. చర్చల ద్వారా ఈయూతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై వచ్చిన విమర్శలపై జైశంకర్ స్పందించారు. భారత్- పాకిస్తాన్ మధ్య తాజా సంఘర్షణలకు కారణం సరిహద్దు సమస్య కాదని, ఉగ్రవాదం అని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిలయంగా మారిందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సురక్షిత ప్రదేశం కాబట్టే అక్కడి మిలిటరీ ఏరియాల్లో ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని జైశంకర్ ఆరోపించారు. ఆ దేశం ఉగ్రవాదులకు సురక్షితం కాకపోతే ఒసామా బిన్ లాడెన్ అక్కడే ఎందుకు దాక్కుంటాడని ప్రశ్నించారు. అంతర్జాతీయ మీడియా, సమాజం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని తాను అశిస్తున్నానని అన్నారు.