NEET UG 2025: నీట్ యూజీ ఫలితాలు విడుదల!

NEET UG 2025: ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు గత నెలలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్- యూజీ) పరీక్ష నిర్వహించింది. పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది.
అంతకుముందు ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం ఉదయం విడుదల చేసింది. తర్వాత కొన్ని గంటలకే తుది ఫలితాలను ఎన్టీఏ రిలీజ్ చేసింది. అభ్యర్థులకు మెయిల్స్ ద్వారా స్కోర్ కార్డులు అందుతున్నట్లు తెలుస్తోంది. నీట్ యూజీ-2025 పరీక్ష రాసిన విద్యార్థులు వెబ్సైట్ https://neet.nta.nic.in/ద్వారా ఫలితాలను చూసుకోవాలని ఎన్టీఏ వెల్లడించింది.
గత నెల మే 4న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 20.8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 5,400 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. విదేశాల్లోని 14 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. రాష్ట్రం నుంచి 72,507 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.
రాజస్థాన్కు చెందిన ఓ విద్యార్థి 700 మార్కులకు 690లు సాధించారు. తెలంగాణ నుంచి 668 టాప్ మార్కులుగా తెలిసింది. తెలంగాణలో 33 ప్రభుత్వ మెడికల్, రెండు డీమ్డ్, 29 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. మొత్తంగా 8,515 ఎంబీబీఎస్ సీట్లున్నట్లు సమాచారం.