Myanmar VS India: ఇండియాపై దాడి చేసేందుకు కుట్ర.. మరో పాకిస్థాన్ కానుందా?
Myanmar Armed Will Plan Attack to India: ఇండియా శత్రు దేశాల జాబితాలో మరో ముస్లిం దేశం కూడా వచ్చి చేరింది. ఇండియాకు వ్యతిరేకంగా దాడులకు కుట్రలు పన్నుతోంది. దాడులకు పెద్ద ఎత్తున నిధులతో పాటు ఆయుధాలను ముస్లిం దేశాలు సమకూరుస్తోంది. ఈసారి మయన్మార్కు చెందిన అరాకన్ ఆర్మీకి పలు ముస్లిం దేశాలు రహస్యంగా సాయం అందిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు ఖచ్చితమైన సమాచారం అందింది. దీంతో దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఇండియాకు ఇరుగు పొరుగు అన్నీ శత్రు దేశాలే.. ఇండియాను ఎప్పుడెప్పుడు అణగదొక్కుదామా అని అవకాశం కోసం కాచుకుర్చుంటాయి. తాజాగా యమన్మార్కు చెందిన అరాకన్ ఆర్మీకి పలు ముస్లిం దేశాలు ఆయుధాలతో పాటు డబ్బు సమకూర్చి ఇండియా ఈశాన్య రాష్ర్టాల్లో అల్లర్లకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు ఇండియన్ ఇంటెలిజెన్స్కు ఖచ్చితమైన సమాచారం అందింది. ఇక ఇండియాకు ప్రధానంగా శత్రు దేశాలు అంటే మనకు గుర్తుకు వచ్చేది చైనా, పాకిస్తాన్లే. దీంతో పాటు మరికొన్ని దేశాలు చాపకింద నీరులా ఇండియాకు వ్యతిరేకంగా జట్టుకట్టి దెబ్బతీయాలని కొన్ని ముస్లిం దేశాలు కుట్రలు పన్నుతున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రస్తుతం తర్కియాను చెప్పుకోవాల్సిందే. ఇటీవల ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు తుర్కియా బహిరంగంగానే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే తుర్కియాను ఏ దేశం నిజమైన స్నేహితుడిగా నమ్మదు.
ఇటీవల బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని శక్తులు ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడం మొదలుపెట్టాయి. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం బంగ్లాదేశ్కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదగ్రూపు జమాత్ ఏ ఇస్లామిని తీసుకుంటే తుర్కియా ఈ ఉగ్ర సంస్థకు పెద్ద మొత్తంలో డబ్బు సంచులు అందిస్తోంది. ఇక తుర్కియా అసలు ఉద్దేశం ఏమిటంటే జామాత్ ఏ ఇస్లామిని అడ్డుపెట్టుకొని ఇండియాలోని ఈశాన్య రాష్ర్టాల్లో టెర్రరిజాన్ని సృష్టించాలని గట్టి ప్లాన్ చేస్తోంది. దీంతో ఇండియాకు అంతర్గతంగాను బయటి నుంచి పెద్ద ఎత్తున ప్రమాదం మాత్రం పొంచి ఉందని ఇంటెలిజెన్స్నివేదికలో హెచ్చరించింది.
తాజా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం .. టర్కీకి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు బంగ్లాదేశ్కు చెందిన రాడికల్ గ్రూపుతో సన్నిహిత సంబందాలు పెట్టుకోవడమే కాకుండా వారికి ఆర్థికంగా మిలిటరీపరంగా సాయం కూడా చేస్తోంది. ఇక తుర్కియాకు చెందిన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పూర్తిస్తాయిలో డాకాలో కొత్త కార్యాలయం ప్రారంభించింది. ఢాకాలోని మోగబజార్లో జమాత్ ఎ ఇస్లామి గ్రూపునకు కొత్త కార్యాలయం నిర్మించి ఇచ్చింది. దీనికి పెద్ద ఎత్తున డబ్బు వ్యయం చేసింది తుర్కియా. ఇవన్నీ ఒక ఎత్తయితే జమాత్కు చెందిన విద్యార్థి నాయకుడు సాదిక్ ఖయ్యుమ్ ప్రస్తుతం తుర్కియాలో పర్యటిస్తున్నాడు. సాదిక్ తుర్కియా పర్యటనలో ఆయన అక్కడ కీలకమైన నాయకులతో భేటీ కావడంతో పాటు అక్కడి ఆయుధాల ఫ్యాక్టరీతో పాటు ఆయుధాలను నిల్వ ఉంచే గిడ్డంగులను కూడా ఆయనకు చూపించారని భారత ఇంటెలిజెన్స్ సర్వీసు తాజా నివేదికలో వివరించింది.
ఇక తుర్కియా ప్రెసిడెంట్ రెసెప్ తయ్యపీ ఎర్దోగార్ విషయానికి వస్తే ఆయన దక్షిణ ఆసియాలో ఇస్లామిక్ గ్రూపుల్లో తన హవా పెంచుకోవాలని చూస్తున్నాడు. ముస్లిం దేశాల్లో తన పట్టు సాధించడానికి .. తుర్కియా పలు ముస్లిం దేశాల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించింది. కాగా ఎర్దోగాన్ ప్రధానంగా ముస్లిం దేశాల్లో తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ కు చెందిన ఇన్వెస్ట్మెంట్ డెవలెప్మెంట్ అధారిటీ చీఫ్ అశిక్ చౌదరిని తీసుకుంటే ఆయన కూడా ఇటీవల తుర్కియాకు వెళ్లి వచ్చాడు. ఆయన కూడా అక్కడ ఆయుధాలతో ప్యాక్టరీని సందర్శించి వచ్చాడు. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే అధికారికంగా మిలిటరీ అధికారులను తుర్కియాకు అయితే పంపలేదు. అయితే అషిక్ చౌదరి తుర్కియా వెళ్లడం పట్ల చాలా మంది ఆశ్చర్య వ్యక్తం చేశారు. అలాగే బంగ్లాదేశ్కు చెందిన జాతీయ భద్రతతో పాటు సమాచారశాఖ సలహాదారుడు కూడా ఇటీవల తుర్కియాలో క్లోజ్ డోర్ మీటింగ్లో పాల్గొని వచ్చారు. ఆయన తుర్కియా భద్రతా అధికారుల జరిపిన భేటీ విషయాలు మీడియాతో పంచకోలేదు. అంతా గోప్యత పాటించడంతో లేని పోని అనుమానాలకు తావిస్తోంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే ఇక అసలు ప్రమాదం విషయానికి తుర్కియా అత్యంత రహస్యంగా మయన్మార్లో ఆరాకన్ ఆర్మీకి అండగా ఉంటోంది. ఇది ఇండియాకు పెద్ద ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా ఇండియాకు చెందిన ఈశాన్య రాష్ర్టాల్లో అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తుందన్న అనుమానాలు కలగకమానవు. కాగా తాజా పరిణామాలను ఒకసారిఅద్యయనం చేస్తే.. తెర వెనకు నుంచి తుర్కియా పెద్ద ఎత్తున ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోందని తెలుస్తోంది. తుర్కియా మన పొరుగున ఉన్న దేశాలతో అక్కడి ఉగ్రముఠాలకు డబ్బుతో పాటు ఆయుధాలు సమకూర్చి ఇండియా జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ భద్రతకు దెబ్బతీయాలని చూస్తోంది. ఇక తుర్కియా విషయానికి వస్తే చిన్నగా దక్షిణాసియాలో ఉగ్రకార్యకలాపాలను పెంచి పోషించాలని చూస్తోంది అందుకే ఎక్కడికక్కడ వర్క్షాపులను నిర్వహిస్తూ…స్కాలర్ షిప్లను ఆపర్ చేస్తూ.. ఇస్లామిక్ ఇన్సిస్టిట్యూట్స్కు పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తూ.. ఉగ్రవాదాన్ని ప్రమోట్ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.
ఇక తుర్కియా మన ఇరుగు పొరుగు దేశాల్లో తన ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తే.. ఇది ఇండియాకు అత్యంత ప్రమాదకరం. ప్రధానంగా ఈశాన్య రాష్ర్టాల విషయానికి వస్తే అస్సాం, త్రిపుర, మెఘాలయ, మిజోరాంలలో రాడికల్ గ్రూపు పట్టు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తుర్కియా నుంచి ఆయుధాలతో పాటు డబ్బు అందుకుంటున్న బంగ్లాదేశ్కు చెందిన జామత్ ఏ ఇస్లామి సున్నితమై ఈ ప్రాంతాల్లో ఉగ్రవాదులను తరలించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కేరళలో ఎన్జీఓ లాంటి జమాత్ చాలా చురుకుగా తన ఉగ్రవాద కార్యకాలాపాలు కొనసాగిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే తుర్కియా పాకిస్తాన్కు చెందిన ఇంటెలిజెన్స్ సర్వీస్ ఐఎస్ఐకు కూడా తుర్కియా ఆర్థికంగా ఆదుకుంటోంది. తుర్కియా గేమ్ ప్లాన్పై అధ్యయనం చేసిన ఇండియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ తుర్కియా వయా బంగ్లాదేశ్ ద్వారా ఈశాన్య రాష్ర్టాల్లో ఇండియాకు ఇబ్బందులు సష్టించాలని పన్నాగం పన్నుతోందని తేల్చి చెప్పింది.
ఇక తుర్కియా ప్రెసిడెంట్ ఎర్దోగాన్ విషయానికి వస్తే ముస్లిం దేశాల్లో తాను కీలక నాయకుడిగా ఎదగాలని కలలు కంటున్నాడు. స్వదేశంలో ప్రతిపక్షాలను అణిచేసి జైళ్లలో పెట్టి నియంతలా పాలిస్తున్నాడు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియా తర్కియాతో వ్యాపార సంబంధాలు క్రమంగా తగ్గించుకోవాలనుకుంటోంది. ఇక ఎర్దోగాన్ కూతరు ఇండియా ఏవియేషన్ రంగం భాగస్వామ్యంలో చేపట్టి భారీగా నష్టపోయింది. ఇవన్నీ అంశాలు ఎర్దోగాన్కు మింగుడు పడ్డం లేదు. ఇండియాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. మరి ఎర్దోగాన్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా లేదా కాలమే చెప్పాలి.