Last Updated:

Aditya- L1: నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య -ఎల్‌1 ఉపగ్రహం

చంద్రయాన్‌-3 విజయం అనంతరం సూర్యుడి దిశగా ఇస్రో ప్రయోగాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ తాజాగా ప్రయోగానికి వేదికైంది.

Aditya- L1: నింగిలోకి  దూసుకెళ్లిన ఆదిత్య -ఎల్‌1 ఉపగ్రహం

Aditya- L1: చంద్రయాన్‌-3 విజయం అనంతరం సూర్యుడి దిశగా ఇస్రో ప్రయోగాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ తాజాగా ప్రయోగానికి వేదికైంది.

భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరం..(Aditya- L1)

ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం నాలుగు నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్‌1’ పాయింట్‌ను చేరుకోనుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్‌ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఇందులో 7 పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమో స్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి. వీటి వల్ల సౌర తుపానుల నుంచి అంతరిక్షంలోని ఆస్తులను కాపాడుకోవడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఆదిత్య L1 ప్రధానంగా సౌర కరోనా యొక్క రిమోట్ పరిశీలనలను అందించడానికి మరియు భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 (సూర్యుడు-భూమి లాగ్రాంజియన్ పాయింట్) వద్ద సౌర గాలి యొక్క ఇన్-సిటు పరిశీలనలను అందించడానికి రూపొందించబడింది.సౌర వాతావరణంలోని డైనమిక్‌లను అర్థం చేసుకోవడం మొత్తం లక్ష్యం, సూర్య-వాతావరణ సంబంధానికి అతినీలలోహిత కిరణాలు ముఖ్యమైనవి, ఎందుకంటే ఇవి భూమి యొక్క స్ట్రాటో ఆవరణలో శోషించబడతాయి, ఈ ప్రక్రియలో భూమి యొక్క వాతావరణం యొక్క రసాయన శాస్త్రాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT) సౌర వాతావరణం యొక్క వివిధ ఎత్తులలో చిత్రాలను సంగ్రహిస్తుంది. అదనంగా, దానిలో చేర్చబడిన ఆన్-బోర్డ్ ఇంటెలిజెన్స్ ఏ భాగాన్ని పరిశీలించాలో నిర్ణయించడానికి అనుమతిస్తుంది.