Published On:

Rain Alert: నేడు, రేపు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

Rain Alert: నేడు, రేపు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

Rain Alert For Next Two Days in Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలో ఇవాళ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురు గాలుల దాటికి చెట్లనుంచి మామిడికాయలు రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు లబోదిబోమంటున్నారు. అలాగే ఆయా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అదే విధంగా అక్కడక్కడ పిడుగులు పడే చాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

 

అలాగే, తెలంగాణలో నేటి నుంచి వచ్చే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈదురుగాలులు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, వరంగల్, జనగామ, హన్మకొండ, కరీంనగర్, భద్రాద్రి కొత్తడూడెం, పెద్దపల్లి, సిద్ధిపేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో చిరు జల్లులు పడే అవకాశం ఉందని చెప్పింది.

 

ఇదిలా ఉండగా, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలకు చేతికి వచ్చిన పంటలు నేలమట్టం కావడంతో ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు.

 

మరోవైపు, ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి. పలు జిల్లాల్లో వర్షాలు పడుతుండగా.. మరికొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండు రోజుల పాటు 41 నుంచి 42 వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.