Supreme Court: జర్నలిస్ట్ కొమ్మినేనికి బెయిల్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
kommineni Srinivasa Rao: అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో ఆయన భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాగా కొమ్మినేని బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ పి.కె. మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆయనను విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.
డిబెట్ లో విశ్లేషకుడి మాటాలతో కొమ్మినేనికి సంబంధం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని.. నిబంధనలను ట్రయల్ కోర్టు నిర్ణయిస్తుందని చెప్పింది. అలాగే రాజధాని అమరావతిపై కొమ్మినేని శ్రీనివాస్ మరోసారి ఎలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. భవిష్యత్తులో జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది. ఈ మేరకు కింది కోర్టు విధించిన షరతులకు లోబడే బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.