Published On:

Bomb Threat: విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

Bomb Threat: విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

Air India Plane: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో థాయ్ లాండ్ లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానాన్ని అత్యవసరంగా థాయ్ లాండ్ లో ల్యాండింగ్ చేశారు. ఈ విషయాన్ని థాయ్ లాండ్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ భారత్ కు సమాచారం ఇచ్చింది.

 

కాగా ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఫుకెట్ నుంచి బయల్దేరిన ఏఐ 379 విమానంలో మొత్తం 156 మంది ప్రయాణికులు ఉన్నట్టు వెల్లడించారు. విమానం టేకాఫ్ అయి గాల్లొ ఉండగా బెదిరింపు మెయిల్ వచ్చిందని, దాంతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అధికారుల సూచన మేరకు పైలట్ విమానాన్ని తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని అధికారులు తెలిపారు. విమానం అండమాన్ సముద్రం మీదుగా కాసేపు చక్కర్లు కొట్టిందని.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ నుంచి అనుమతి రాగానే ఐలాండ్ లో సురక్షితంగా దిగిందని పేర్కొన్నారు.

 

విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్ పోర్ట్ అధికారులు, బాంబ్ తనిఖీ బృందాలు, పోలీసులు విమానంలో తనిఖీలు చేపట్టారు. అందులో బాంబు జాడ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో ఎలాంటి బాంబు లేదని థాయ్ లాండ్ ఎయిర్ పోర్ట్ అథారిటీ తేల్చింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.