Home / Amaravati
ఈ ముఖ్యమంత్రి ఆ నాడు ప్రతిపక్షంలో ఉండి అమరావతికి మరో ఐదువేల ఎకరాలు కావాలని చెప్పి ఇపుడు మూడు రాజధానులని నాటకాలు ఆడుతున్నాడంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం రాత్రి కత్తిపూడి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అమరావతిపై యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు.
TDP-YSRCP: అమరావతిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రతి సవాళ్లతో అమరావతి అట్టుడుకుతోంది. ఇసుక రవాణా అవినీతిపై చర్చకు రావాలని రెండు వర్గాలు సవాళ్లు విసురుకున్నాయి.
Nara Lokesh Birthday: నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయనకు పట్టినరోజు శుభాకాంక్షలు వివిధ పద్ధతుల్లో చెబుతున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఓ అభిమాని నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఫోటో వైరల్ గా మారింది. ఇప్పటి వరకూ సినీ నటీనటులకు, క్రీడాకారులకు ఇలాంటి అభిమానాన్ని చూశాం. కానీ ఇలాంటి అభిమానం రాజకీయ నాయకులకు ఉంటుంది అని నిరూపించాడు ఓ […]
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును ధర్మాసనం తప్పుబట్టింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి 8 ఏళ్లకు పైబడినా రాజధాని అంశాలు ఏపీ ప్రజలను నిరాశపరుస్తున్నాయి. అభివృద్ధికి ఎంతో కీలకమైన రాజధానిని నేటి ప్రభుత్వం రాజకీయం చేయడంతో పలు పిటిషన్లు సుప్రీంకోర్టుకు చేరాయి. దీనిపై ధర్మాసనం నేడు విచారణ చేటప్టనుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో దాఖలైన పిటిషన్లను నేను లేని మరో ధర్మాసనంకు బదిలీ చేయాలని చీఫ్ జస్టిస్ యు. యు. లలిత్ రిజిస్ట్రీని ఆదేశించారు.
లక్షలాది మందితో కలిసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడోయాత్రకు లేని ఆంక్షలు, అమరావతి రైతుల పాదయాత్రకు ఎందుకని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు
రైతుల తలపెట్టిన పాదయాత్ర పై ఇటు ప్రభుత్వం, అటు రైతుల పిటిషన్ల పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని న్యాయవాదులు కోరారు.
ఆంద్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశం లేదని, ఒక్కటే రాజధానిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ శంఖు స్ధాపన చేసిన అమరావతినే రాజధానిగా ఆయన స్పష్టం చేశారు.
ప్రకృతి సహజ సిద్ధమైన రుషికొండను, నేటి ప్రభుత్వం బోడి కొండగా మార్చిందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి తెదేపా కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన మట్లాడారు.