Home / Supreme Court
SSC CGL: ఈ నెల 13వ తేదీ నుంచి జరగాల్సిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్) పరీక్ష వాయిదా పడింది. సెప్టెంబర్ తొలి వారంలో ఎగ్జామ్లను నిర్వహిస్తామని కమిషన్ తెలిపింది. పూర్తిస్థాయి పరీక్ష షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని ప్రకటించింది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో 14,582 ఖాళీల భర్తీకి ఎస్ఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా టైర్-1 పరీక్షలు ఈ నెల 13వ తేదీ నుంచి […]
Supreme court: బీహార్లో ఓటర్ల జాబితా సవరణ తర్వాత సుమారు 65 లక్షల మంది ఓటర్లను లిస్టు నుంచి తొలగించారు. అయితే తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలను వెల్లడించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 12 లేదా 13 తేదీల్లో బీహార్ సిర్ ప్రక్రియపై సుప్రీంలో మళ్లీ విచారణ జరగనున్నది. ఈ సందర్భంగా తొలగించిన ఓటర్ల వివరాలను బహిర్గతం చేయాలని సుప్రీం చెప్పింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ […]
Tamilnadu: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. సీఎం స్టాలిన్ పేరును రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ఉపయోగించడాన్ని నిషేధిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం స్టాలిన్ పై ప్రత్యేకంగా విమర్శలు చేసినందుకు పిటిషనర్ అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగంను కోర్టు తీవ్రంగా మందలించింది. అలాగే పిటిషనర్ ఎంపీపై రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని […]
Rahul Gandhi: భారత భూభాగంలోని 2 వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించిందని రాహుల్ గాంధీకి ఎలా తెలుసునని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గతంలో ఆయన ఈ చేసిన ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మన భూమిని చైనా ఆక్రమించిందని మీకెలా తెలుసు అని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాషితో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. అయితే క్రిమినల్ పరువునష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే విధించింది. […]
MLA Defections: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విలువలు లేవని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్ చేశారు. అసలు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిందే బీఆర్ఎస్ పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014, 2018 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది వేరే పార్టీల ఎమ్మెల్యేలను వారి పార్టీలోకి చేర్చుకున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష పార్టీలకు అస్తిత్వం లేకుండా చేశారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై నిన్నటి సుప్రీంకోర్టు […]
Betting APPs Case: యువత ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. బెట్టింగ్ యాప్స్ విషయంలో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసును పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ సైతం, ప్రమోట్ చేసిన సెలబ్రెటీలను విచారిస్తోంది. అయితే దేశంలో బెట్టింగ్స్ యాప్స్ ను పూర్తిగా నిషేధించాలని సుప్రీంకోర్టులో ప్రజాశాంతి […]
Mohanbabu Family: సినీ నటుడు మంచు మోహన్ బాబు, మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల కోడ్ కేసులో తిరుపతి జిల్లాలో ఉన్న తమ విద్యా సంస్థలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 2019లో సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచి విష్ణు ఆందోళన నిర్వహించారు. దాంతో తండ్రి కొడుకులపై కేసు నమోదయింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలను చేయాలంటూ మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, […]
BRS Working President KTR: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం నిర్ణయాన్ని బీఆర్ఎస్ స్వాగతిస్తుందని పేర్కొన్నారు. దేశం ప్రజాస్వామ్య నిర్మాణం హానికరమైన పద్ధతుల ద్వారా క్షీణించకుండా చూసుకున్నందుకు ప్రధాన న్యాయమూర్తికి కృతజ్ఞతలు […]
Malegaon blast case: మహారాష్ట్రలోని మాలేగావ్లో 2008లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ మాజీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం ఏడుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ తీర్పు వచ్చింది. ఇదిలా ఉండగా, 2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా […]
Supreme Court Sensational judgment: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పై స్పీకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు తమ వద్ద పెండింగ్లో ఉంచుకోవడం సరికాదన్నారు. కాగా, అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన తర్వాత స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. కాగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ […]