Home / Bail
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమోదైన మూడు కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు సీఎంగా ఉండగా ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) అలైన్మెంట్, లిక్కర్ పాలసీ మరియు ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయని కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన కోడికత్తి హత్యాయత్నం కేసులో నిందుతుడుగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోసం అతని తల్లి నిరాహారదీక్ష చేపట్టనుంది. ఈ నెల 25న తాడేపల్లిలోని సీఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టేందుకు ఆమె సమాయత్తమౌతుంది.
విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో జనసైనికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఏడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఢిల్లీ కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సుకేష్ చంద్రశేఖర్ ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు.
అమరావతి అసైన్డ్ భూముల కేసులో నారాయణకు హైకోర్టు మూడు నెలల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు.
విప్లవకవి వరవరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. బీమా కోరేగావ్ కేసులో నిందితుడుగా ఉన్న వరవరరావుకు అనారోగ్య కారణాల వల్ల బెయిల్ మంజూరు చేసింది. ఇచ్చిన బెయిల్ను ఎలాంటి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు బెంచ్ జడ్జి యుయు లలిత్ ఆదేశించారు.