Home / తెలంగాణ
PCC Chief: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల విషయంలో మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని మహేశ్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఇలాంటి అంశాలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, కానీ ముందుగానే ప్రజలకు తెలియజేయడం సరైనది కాదన్నారు. ప్రస్తుతం కోర్టు […]
Telangana: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్, ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల కోసం 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కాగా వీరికి మే 22 నుంచి మే 29 వరకు పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఇవాళ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా చూసుకోవచ్చు. అలాగే పరీక్షలకు […]
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూర్ మండలం బీర్సాయిపేట వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికుల సమచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. […]
ACB Enquiry: ఫార్ములా ఈ కార్ రేసు కేసును ఆరు నెలలుగా విచారిస్తున్నారని.. ఇప్పటికీ ఏం తేల్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఆనందం పొందుతోందని విమర్శించారు. ఎన్నిక కేసులు పెట్టినా.. తాము భయపడేదిలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని బయటపెడతామని తెలిపారు. కాగా ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. […]
KTR: ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఏసీబీ ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ను విచారించారు. తాజాగా మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ- ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు ఎంక్వైరీ చేశారు. అయితే గత మే 28నే […]
Road Extend Works: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అధికారులు ఇళ్లు, షాపులను కూల్చివేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలను ఇవాళ ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు. దీంతో స్థానికంగా కొంత ఉద్రిక్తత నెలకొంది. మొత్తం 10 జేసీబీలతో అధికారులు పది బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే కూల్చివేత పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉండే ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా దీంతో పోలీసులు […]
Hyderabad: తెలంగాణ కేబినెట్ భేటీ నేడు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం కానుంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గ ఆమోదం అనంతరం ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. […]
Electric shock: జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్ద 9 మందికి విద్యుత్ షాక్ కొట్టింది. ఎనిమిది మందికి కరెంట్ షాక్ కొట్టగా.. కట్టెతో కాపాడే ప్రయత్నం చేసే మరొకతనికి కూడా విద్యుత్ షాక్ తగిలింది. చికిత్స పొందుతూ వినోద్ , సాయి అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు […]
Telangana Cabinet Held Today: తెలంగాణ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గ ఆమోదం అనంతరం ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి పొంగులేటి […]
5 died in Godavari River at Basara: నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో మునిగి ఐదుగురు యువకులు మృతిచెందారు. హైదరాబాద్ కు చెందిన 18 మంది సభ్యుల కుటుంబం అమ్మవారి దర్శనానికి బాసర వచ్చింది. గోదావరి స్నానం చేస్తుండగా నదిలో మునిగి ఐదుగురు మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. యువకులు నదిలో మునిగిపోతుండగా పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని […]