Last Updated:

AP Assembly: కొడాలినానిపై ఈగ వాలితే సహించేది లేదు.. మంత్రి రోజా

కొడాలి నాని మాట్లాడే భాషలో తప్పులేదని ఆయన పై ఈగ వాలితే సహించేది లేదని మంత్రి రోజా హెచ్చరించారు. గురువారం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ టీడీపీ నేతల తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

AP Assembly: కొడాలినానిపై ఈగ వాలితే సహించేది లేదు.. మంత్రి రోజా

Amaravati: కొడాలి నాని మాట్లాడే భాషలో తప్పులేదని ఆయన పై ఈగ వాలితే సహించేది లేదని మంత్రి రోజా హెచ్చరించారు. గురువారం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ టీడీపీ నేతల తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని, బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి టీడీపీ మోసం చేసిందని విమర్శించారు. ప్రజా సమస్యల పై చర్చించాలనే చిత్తశుద్ధి టీడీపీ నేతలకు లేదని, వారికి రాజకీయాలే ముఖ్యమని అన్నారు. టీడీపీ గ్రామాల్లో తిరిగితే ఎంత మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో తెలుస్తుందన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇవ్వాల్సిన డీఎస్ఈని, జగనే ఇచ్చారని రోజా అన్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని అన్నారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా 10,143 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. ప్రజల మద్దతు ఉండబట్టే మూడు రాజధానుల విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావన చేస్తోందని, అందుకే రాజధాని ప్రాంతం సహా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో వైస్సార్సీపీ విజయం సాధించిందన్నారు.

చంద్రబాబు వెనుక ఎంతమంది ఎమ్మల్యేలు ఉన్నారో తెలుసా? అని రోజా ప్రశ్నించారు. మూడు రాజధానుల ప్రస్తావన వస్తే వైస్సార్సీపీ ఎమ్మల్యేలు ఎందుకు రాజీనామా చేయాలన్నారు. రాంగ్ రూట్‌లో ఎమ్మెల్సీ అయిన లోకేష్ సీఎం జగన్‌ పై అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలతో కొట్టిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి: