Home / వ్యవసాయం
Tandur: పప్పుల్లో చాలా రకాలు ఉంటాయి.. కానీ అందులో ఈ పప్పు వేరు.. కాదు కాదు ఇక్కడ పండించిన కందిపప్పే ప్రత్యేకం. అది ఏంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే మన తాండూర్ వెళ్లాల్సిందే. ఇక్కడ పండించే కందిపప్పు చాలా ప్రత్యేకం.. ఈ పప్పుకు నాణ్యతలో మరేది సాటి రాదు.. అలాగే రుచి కూడా వేరు. అందుకే ఇక్కడ పండించే కందిపప్పుకు డిమాండ్ ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్ లోనూ ఈ కంది పప్పుకు మంచి డిమాండ్ ఉంది. అందుకే […]
కష్టించి పండించిన పంటకు మద్ధతు ధర రాకపోతే ఆ రైతన్న ఆవేదన వర్ణనాతీతం. తాను పండించిన 205 కిలోల ఉల్లిగడ్డను 415 కిలోమీటర్లు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెట్టుకుని మరీ తీసుకెళ్లగా ఆయనకు అన్ని ఖర్చులు పోయి చివరకు చేతికి అందింది కేవలం రూ. 8.36 పైసలు. ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన ఓ రసీదు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
నిన్నమొన్నటి వరకు మంచి ధర పలికిన టమాట ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయింది. రెండంకెల్లో ఉన్న ధర ఇప్పుడు రెండు రూపాయలకు పడిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
కూరగాయల్లో రారాజుగా పేరున్న వంకాయను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికమొత్తంలో రైతులు పండిస్తున్నారు. సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల అనేక నష్టాలు చవిచూస్తున్నారు రైతులు. ఎంత కష్టపడి ఎన్ని రసాయనిక మందులు వాడుతున్నా పంటను చీడపీడలు పట్టిపీడిస్తున్నాయని తమకు వ్యవసాయ శాస్త్రవేత్తలు తగిన సూచనలు సలహాలు ఇచ్చి పంట దిగుబడి వచ్చేలా సహాయం చెయ్యాలని అనంత రైతలు కోరుతున్నారు. మరి దీనికి వ్యవసాయాధికారులు ఏ విధమైన సూచనలిస్తున్నారో ఓ సారి చూసెయ్యండి.
పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో నేడు టమోట ధర అమాంతం పడిపోయింది. కిలో ధర 0.50పైసలు పలకడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంటలపై తెగుళ్ల నియంత్రణకు రైతులు పిచికారీ చేసే ‘షార్ప్’(బ్యాచ్-ఎస్0264) రసాయనిక పురుగుమందుపై తెలంగాణ వ్యవసాయశాఖ నిషేధం విధించింది. ఆ మందు నాసిరకం అని తేలడంతో అమ్మకాలు, వినియోగంపై ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Cotton : ప్రత్తి తెగుళ్ళను నివారించే పద్దతుల గురించి తెలుసుకుందాం !
తెలుగు రాష్ట్రాల్లో రైతులు వరి, మినుమ పంటను ఎక్కువుగా సాగు చేయనున్నారు. వరి తర్వాత మనం ఎక్కువగా పండించే పంటల్లో మినుము కూడా ముందు వరుసలో ఉంది. మినుము పంట సాగుకు మాగాణి, మెట్ట భూములు అనుకూలంగా ఉంటాయి.