Last Updated:

Bengal Teachers: పశ్చిమ బెంగాల్ లో 24వేలమంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోతున్నారు.. ఎందుకో తెలుసా?

ఉద్యోగాల కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యుబిఎస్‌సిసి పాఠశాల ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన 2016 రిక్రూట్‌మెంట్ ప్యానెల్ మొత్తాన్ని కలకత్తా హైకోర్టు సోమవారం రద్దు చేసింది. సుమారుగా 24,000 ఉద్యోగాలను కోర్టు రద్దు చేసింది. వీటిలో బెంగాల్‌లోని వివిధ రాష్ట్ర-ప్రభుత్వ ప్రాయోజిత మరియు ఎయిడెడ్ పాఠశాలలకు 2016లో ప్రవేశ పరీక్ష ద్వారా నియమించబడిన బోధన, బోధనేతర సిబ్బంది యొక్కనియామకాలు ఉన్నాయి.

Bengal Teachers: పశ్చిమ బెంగాల్ లో  24వేలమంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోతున్నారు.. ఎందుకో తెలుసా?

Bengal Teachers: ఉద్యోగాల కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యుబిఎస్‌సిసి పాఠశాల ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన 2016 రిక్రూట్‌మెంట్ ప్యానెల్ మొత్తాన్ని కలకత్తా హైకోర్టు సోమవారం రద్దు చేసింది. సుమారుగా 24,000 ఉద్యోగాలను కోర్టు రద్దు చేసింది. వీటిలో బెంగాల్‌లోని వివిధ రాష్ట్ర-ప్రభుత్వ ప్రాయోజిత మరియు ఎయిడెడ్ పాఠశాలలకు 2016లో ప్రవేశ పరీక్ష ద్వారా నియమించబడిన బోధన, బోధనేతర సిబ్బంది యొక్కనియామకాలు ఉన్నాయి.

నాలుగు వారాల్లోగా జీతాలు తిరిగి ఇచ్చేయాలి.. (Bengal Teachers)

అంతేకాదు రిక్రూట్‌మెంట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి దాదాపు 23 లక్షల OMR షీట్లను తిరిగి మూల్యాంకనం చేయాలని బెంచ్ ఆదేశించింది. చట్టవిరుద్దంగా రిక్రూట్ అయిన ఈ ఉద్యోగులందరూ నాలుగు వారాల్లోగా తమ జీతాలను 12 శాతం వడ్డీతో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నుంచి డబ్బులు వసూలు చేసే పనిని జిల్లా మేజిస్ట్రేట్‌లకు అప్పగించారు.ఆర్డర్‌పై స్టే కోసం కొంతమంది అప్పీలుదారులు చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. నియామక ప్రక్రియకు సంబంధించి తదుపరి విచారణ చేపట్టి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా తాజా నియామక ప్రక్రియను ప్రారంభించాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ను కోర్టు కోరింది. ఈ కేసులో విచారణను మార్చి 20న ముగించిన హైకోర్టు, తీర్పును డివిజన్ బెంచ్ రిజర్వ్ చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. సీబీఐ 2022లో బెంగాల్ మాజీ విద్యా మంత్రి పార్థ ఛటర్జీని ఈ స్కామ్‌లో అరెస్టు చేసింది.ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని తమ్లూక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగూలీ ఈ కేసుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు.

హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ, బీజేపీ నాయకులు న్యాయవ్యవస్థను మరియు తీర్పులను ప్రభావితం చేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలకు కోర్టు ఈ విధంగా తీర్పు ఇస్తుందని ముందుగానే ఎలా తెలుసని ఆమె సువేందు అధికారి ప్రకటనను ఉటంకిస్తూ ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ కూడా దీనికి ఘూటుగా బదులిచ్చింది. హైకోర్టు 2016 నుండి సుమారు 24,000 రిక్రూట్‌మెంట్‌లను రద్దు చేసింది, సీబీఐ ఎవరినైనా కస్టడీలోకి తీసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థుల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. ఇప్పుడు మేనల్లుడు, అతని అత్త వెళ్ళే సమయం వచ్చింది. # తృణమూల్ కాంగ్రెస్ బహిర్గతం అని బీజేపీ పేర్కొంది.