Home / Kodali Nani
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ లీడర్ నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు. లోకేష్ సమర్ధుడైతే ఇంట్లోని మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని కామెంట్ చేశారు. ఈ మేరకు గుడివాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన లోకేష్ ఢీల్లీ పారిపోయి.. తన తల్లిని రోడ్లపై తిప్పుతున్నారని తీవ్రంగా విమర్శించారు.
చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి చంద్రబాబు అన్నారని ఇప్పుడు బెయిల్కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవని ప్రకటించిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారు.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో మాట్లాడుతూ.. ఏపీ సర్కారుపై పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. పోలవరం, ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమాలపై పడుతున్నారెందుకని ఆయన మాట్లాడారు.
ఏపీ ప్రభుత్వంపై వాల్తేరు వీరయ్యసినిమా 200 రోజుల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపట్ల గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వైసీపీ కొడాలి నాని ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న పకోడిగాళ్లకి కూడా చెబితే బాగుంటుందని చిరంజీవికి సూచించారు.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హత చంద్రబాబు లేదని.. వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఈ మేరకు తాడేపల్లి లోనో వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో కడలి నని విరుచుకుపడ్డారు. చంద్రబాబు.. ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నారు.
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగువారు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా.. విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని చారిటబుల్
‘ఇదేం ఖర్మ’ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గత రాత్రి గుడివాడలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నం ఎయిర్పోర్టులో కోడికత్తి డ్రామా ఆడారని.. టీడీపీకి సంబంధం ఉందని ఆరోపణలు చేశారన్నారు.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు పాదయాత్రను ప్రారంభించిన టీడీపీ నేత నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ ను ఉద్దేశస్తూ... 'ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు. పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు' అని ఎద్దేవా చేశారు.
Kandukur Incident : నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా కందుకూరు తొక్కిసలాట ఘటన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేస్తూ… తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి […]