Home / YSRCP
అవినీతి మయమైన వైసీపీ ని పాతాళానికి తొక్కేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు .గురువారం సాయంత్రం రాజం పేట జిల్లా రాజం పేటలో కూటమి ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అంటూ నినాదాలు ఇచ్చారు .మన రాష్ట్రం,మన నేల ,మన ప్రజలు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల కూడదని కూటమి కట్టామని అన్నారు .
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సత్యవేడు ఎమ్మల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం తెలుగుదేశం జాతీయపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఆయనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్యవేడు నుంచి పోటీ చేయడానికి టికెట్ దక్కలేదు. దీనికి ప్రతిగా తిరుపతి నుంచి ఎంపీగా పోటీచేయమని చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు.
నెల్లూరు జిల్లాలోని నారాయణ గ్రూప్ విద్యార్థుల కుటుంబ సభ్యుల డేటాను సేకరిస్తోందని ని ఫిర్యాదు చేస్తూ వైఎస్సార్సీపీ ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేసింది.వివిధ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు వృత్తిపరమైన కళాశాలలతో కూడిన నారాయణ విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్లోని విద్యా రంగంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాయి. వారి విద్యా సంస్థల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యుల నుండి వ్యక్తిగత డేటా సేకరణలో నిమగ్నమై ఉన్నాయని తెలిపింది.
ఏపీలో అధికార వైసీపీ పార్టీకీ మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. త్వరలో జనసేనలో చేరుతున్నానని బాలశౌరి ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా తనకి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాలశౌరి మనస్తాపంతో ఉన్నారు.
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అధికార వైసీపీకి షాకిచ్చారు. 2023 డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన అంబటి రాయుడు పది రోజులు కూడా తిరగకముందే ఆ పార్టీకి గుడ్బై చెప్పేశారు. ఈ మేరకు అంబటి రాయుడు ట్వీట్ చేశారు. తాను అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
వైసీపీకి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుడ్బై చెప్పారు. జగన్ను నమ్మి పార్టీలోకి వచ్చానని.. నమ్మినందుకు గొంతు కోశారని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. సర్వే పేరుతో టికెట్ ఇవ్వమని అనడం సరికాదని మండిపడ్డారు. అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాననని.. తాను రాయదుర్గం నుంచి తన భార్య కల్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సూచనల మేరకు సోమవారం 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను మార్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.కొత్తగా నియమితులైన ఇన్ఛార్జ్లు మంగళవారం నుంచి పార్టీ కార్యకలాపాలు చూసుకుంటారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మూడు చోట్ల ఈరోజు వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "సామాజిక సాధికారిత బస్సు యాత్ర"లు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర లోని ఇచ్ఛాపురం.. కోస్తాలోని తెనాలి.. రాయలసీమలోని శింగనమల నుంచి ఈ బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ యాత్రలో భాగంగా 53 నెలల వైఎస్ జగన్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి,
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్, రీజినల్ కో ఆర్డినేటర్లు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం,మండల స్థాయి ముఖ్య నాయకులతో కలిసి 8,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
వైకాపా మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఓ మహిళ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. శ్రీకాకుళంలోని ఎల్బీఎస్ కాలనీలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి మంత్రి ధర్మాన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో గూనపాలేనికి చెందిన వై.ఆదిలక్ష్మికి ధ్రువపత్రాన్నిఅందించారు.