Home / క్రీడలు
Cricket: వచ్చే ఏడాది ప్రారంభంలో టీమిండియా.. న్యూజిలాండ్ తో సుదీర్ఘ సిరీస్ కొనసాగించనుంది. ఈ మేరకు 2026 జనవరిలో న్యూజిలాండ్ జట్టు ఇండియా టూర్ కి రానుంది. ఇందులో కివీస్ తో భారత్ 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ నిన్న ప్రకటించింది. మ్యాచ్ లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. జనవరి 11 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. […]
South Africa win World Test Championship final by 5 wickets: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా మట్టికరిపించి కొత్త ఛాంపియన్గా అవతరించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్లో 282 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా సులువుగా ఛేదించింది. ఓపెనర్ మార్క్రమ్(136) సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత బపుమా(66) […]
India vs New Zealand T20 match in Uppal: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు బీసీసీఐ తీపి కబురు చెప్పింది. నగరంలోని ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానం మరో ధనాధన్ పోరుకు ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానున్న న్యూజిలాండ్తో భారత జట్టు ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు కివీస్ జట్టు జనవరిలో భారత్కు రానుంది. హైదరాబాద్తోపాటు జైపూర్, మొహాలి, ఇండోర్, […]
BCCI : అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురువారం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 265 మంది ప్రయాణికులు మృతిచెందారు. మృతులకు భారత జట్టు ఆటగాళ్లు నివాళులర్పించారు. టీమ్ ఇండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా శుక్రవారం బెకెన్హామ్లో ఇంట్రా స్వ్కాడ్ మ్యాచ్ ఆడుతోంది. మ్యాచ్కు ముందు భారత జట్టు ఆటగాళ్లు, సహాయక […]
South Africa vs Australia WTC Final 2025: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రెండో రోజూ ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే, 20 ఏళ్లల్లో 2005 నుంచి ఇప్పటివరకు లార్డ్స్ వేదికగా ఒకే ఒక్కసారి మాత్రమే 200కు పైగా టార్గెట్ చేధించినట్లు రికార్డు […]
South Africa vs Australia in WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీగా జరుగుతోంది. ఈ మ్యాచ్లో తొలి రోజు బౌలర్ల హవా కొనసాగింది. తొలి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా జట్టుపై దక్షిణాఫ్రికా బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. దీంతో ఆస్ట్రేలియా 212 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో వెబ్ స్టర్(72), స్టీవెన్ స్మిత్ (66) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్ ఖవాజా(0) డకౌట్ […]
Karnataka Government: ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్బంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటకు ఆర్సీబీ, బీసీసీఐ ప్రధాన కారణమని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించింది. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీకి ఫ్రాంఛైజీ యాజమాన్యం ప్రభుత్వ అనుమతి కోరలేదని సర్కార్ వెల్లడించింది. తొక్కిసలాట ఘటనలో తమపై నమోదైన కేసులను సవాల్ చేస్తూ ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేతో సహా నలుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు ఇవాళ విచారణ చేసింది. జస్టిస్ ఎస్ఆర్ […]
ICC Test Championship: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోరుకు సమయం ఆసన్నమైంది. లండన్ లోని లార్డ్స్ స్టేడియం వేదికగా నేటి నుంచి ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక పోరులో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. కాగా ఈ మ్యాచ్ లో గెలిచి టైటిల్ సాధించాలని ఇరుజట్లు గట్టి పట్టుదల మీద ఉన్నాయి. ఇప్పటికే ఐసీసీ నిర్వహించిన అన్ని ఫార్మట్లలో టైటిళ్లు సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో కూడా గెలిచి మరో టైటిల్ ను తన అకౌంట్ […]
Nicholas Pooran Announced Retirement From International Cricket: అంతర్జాతీయ క్రికెట్కు మరో స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యాన్స్కు బిగ్ షాక్ ఇచ్చాడు. వెస్టిండీస్ విధ్వంసక ప్లేయర్ నికోలస్ పూరన్ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు అందులో రాసుకొచ్చారు. ‘అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నా. నేను తీసుకున్న ఈ నిర్ణయం చాలా కష్టంగానే ఉంది. అయినప్పటికీ ఈ విషయంపై సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. నేను ఇష్టంతో […]
Bengaluru Stampede: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కీలక పరిణామం నెలకొంది. తమపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆర్సీబీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఎ ఎంటర్టైన్మెంట్ నెటవర్క్స్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఆర్సీబీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, ర్యాలీకి పెద్దఎత్తున వచ్చిన అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోయారని ఆరోపిస్తూ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్ లో పేర్కొంది. స్టేడియంలో […]