Last Updated:

Viral video: కబడ్డీ ప్లేయర్లకు టాయిలెట్ లో వండిన భోజనం

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో 200 మందికి పైగా కబడ్డీ ఆటగాళ్లకు స్టేడియం టాయిలెట్‌లో ఉంచిన ప్లేట్ల నుండి అన్నం వడ్డించినట్లు ఆరోపణలు వచ్చాయి,

Viral video: కబడ్డీ ప్లేయర్లకు టాయిలెట్ లో వండిన భోజనం

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో 200 మందికి పైగా కబడ్డీ ఆటగాళ్లకు స్టేడియం టాయిలెట్‌లో ఉంచిన ప్లేట్ల నుండి అన్నం వడ్డించినట్లు ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో రౌండ్లు చేస్తున్న చిత్రాల వరుస ప్రకారం. సెప్టెంబర్ 16న ప్రారంభమైన అండర్-17 మహిళల కబడ్డీ టోర్నమెంట్‌లో క్రీడాకారులు పాల్గొంటున్నపుడు ఈ సంఘటన జరిగింది.

వైరల్ క్లిప్‌లో, సహారాన్‌పూర్‌లోని భీమ్‌రావ్ అంబేద్కర్ స్టేడియం గేట్ద దగ్గర టాయిలెట్ లో ఉంచిన పాత్రల నుండి అన్నం, పప్పు మరియు కూరతో సహా ఆహారం ఆటగాళ్లకు వడ్డించడం చూడవచ్చు. ఈ వీడియో సోమవారం చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. తర్వాత ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన అధికారులు జిల్లా క్రీడా అధికారి అనిమేష్ సక్సేనాను అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ విషయం పై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఈ వీడియో పై భారత వెటరన్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ తన వేదనను వ్యక్తం చేశాడు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని దత్ డిమాండ్ చేశాడు. ఇటువంటి సంఘటనలు వెలుగులోకి రావడం చాలా బాధాకరం. గౌరవం పొందడం ప్రతి క్రీడాకారుడు మరియు పౌరుడి హక్కు. క్రీడాకారులు టాయిలెట్‌లో తమ ఆహారాన్ని ఎందుకు తినవలసి వచ్చింది అని టోర్నమెంట్ నిర్వాహకుల నుండి తెలుసుకోవడం చాలా ముఖ్యం అని దత్ పేర్కొన్నాడు.

 

ఇవి కూడా చదవండి: