Published On:

Iran – Israel War: ఇజ్రాయెల్‌ – ఇరాన్‌ యుద్దం.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం!

Iran – Israel War: ఇజ్రాయెల్‌ – ఇరాన్‌ యుద్దం.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం!

Benjamin Netanyahu Postpones his Son Wedding due to Iran – Israel War: దాడులు , ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇటు ఇజ్రాయెల్ అటు ఇరాన్ వ్యూహాత్మకంగా ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా టెహ్రాన్ ది సౌత్ పార్స్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ఈ దాడి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు , ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఎవరికి ఎవరూ తీసిపోని రీతిలో రెండు దేశాలు దాడులకు తెగబడ్డాయి.

 

తాజాగా టెహ్రాన్ ప్రధాన ఆర్థిక జీవనాడి అయిన ది సౌత్ పార్స్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది.కాగా ది సౌత్ పార్స్ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ది సౌత్ పార్స్ ప్రపంచవ్యాప్తంగా పేరున్న గ్యాస్ క్షేత్రం. అంతేకాదు యావత్ ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ క్షేత్రం ది సౌత్ పార్స్. కాగా ఇరాన్ పై వ్యూహాత్మకంగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ . వాస్తవానికి ప్రపంచంలోని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో ఇరాన్ లోని చమురు క్షేత్రాలను ఇజ్రాయెల్ సైనిక బలగాలు టార్గెట్ చేసుకున్నాయి. చమరు క్షేత్రాలపై దాడులు జరిగితే ఆ ప్రభావం ఇరాన్ ఆర్థిక పరిస్థితులపై తప్పకుండా పడుతుంది.

 

ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసస్తుంది. కాగా ఇజ్రాయెల్ దాడులు.. తమ దేశంలోని అనేక చమురు క్షేత్రాలను దెబ్బతీశాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా షహ్రాన్ లోని ఒక భారీ గ్యాస్ క్షేత్రం పూర్తిగా ధ్వంసమైందని చమురు మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో 11 చమురు ట్యాంకులు పేలిపోయాయన్నారు. దీంతో .. భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ఈ అగ్నికీలలు సమీప ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం కూడా ఉంది.

 

దాడులు , ప్రతిదాడులతో ప్రస్తుతం పశ్చిమాసియా రగిలిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో జరగాల్సిన ఆయన పెద్ద కుమారుడు అవ్ సర్ వివాహ కార్యక్రమాన్ని బెంజమిన్ నెతన్యాహు వాయిదా వేసుకున్నారు.వాస్తవానికి ఈ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి నెతన్యాహు కుటుంబం సిద్ధమైంది. అయితే అంతలోకే అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అణు ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ ససేమిరా అనడంతో ఆ దేశం ఇజ్రాయెల్ దాడులు మొదలెట్టింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఎదురు దాడులు మొదలెట్టింది.

 

పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల నేపథ్యంలో కుమారుడి వివాహ కార్యక్రమాన్ని నెతన్యాహు వాయిదా వేశారు. కాగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటి నుంచి నెతన్యాహు కుమారుడి అంశం వివాదాస్పదంగా మారింది. వేలాది మంది అమాయక ఇజ్రాయెల్ ప్రజులు యుద్దంలో చనిపోతుంటే…కుమారుడి వివాహం చేయడానికి నెతన్యాహు రెడీ అవుతున్నారంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల అభిప్రాయాన్ని మన్నించి కుమారుడి వివాహాన్ని వాయిదా వేయాలని నెతన్యాహు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఏమైనా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు మరింత తీవ్రతరమవుతున్నాయి. మరికొంతకాలం ఈ మారణ హోమం కొనసాగేలా కనిపిస్తోంది.

 

ఇవి కూడా చదవండి: