PM Modi Cyprus Tour: సైప్రస్ లో ప్రధానికి ఘనస్వాగతం.. అత్యున్నత పురస్కారంతో సత్కారం
PM Modi Cyprus Tour: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ కు చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న ప్రధానికి ముందుగా ఘనస్వాగతం లభించింది. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైన్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సైప్రస్ కు వెళ్లారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. మోదీని సైప్రస్ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో అక్కడి ప్రభుత్వం సత్కరించింది. ఈమేరకు ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్’ అనే పురస్కారం అందుకున్నారు. కాగా సైప్రస్ అత్యున్నత పురస్కారంతో సత్కరించినందుకుగాను ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి గుర్తుగా అవార్డును అంకితం చేస్తున్నట్టుగా మోదీ ప్రకటించారు.
కాగా గడిచిన రెండు దశాబ్దాల అనంతరం భారత ప్రధాని సైప్రస్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సైప్రస్ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైన్స్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక, భాగస్వామ్య అంశాలపై చర్చించారు. ప్రధాని అనంతరం కెనడాలో జరిగే జీ7 సమ్మిట్ కు హాజరుకానున్నారు. తర్వాత క్రొయేషియాలో పర్యటించనున్నారు.
#WATCH | Nicosia, Cyprus: Prime Minister Narendra Modi says, "…I am confident that in the time to come, our active partnership will touch new heights. Together, we will not only strengthen the progress of our two nations but also contribute towards building a peaceful and… pic.twitter.com/8Pf07YoY5C
— ANI (@ANI) June 16, 2025