Pakistan: పాకిస్తాన్ లో అల్లర్లు.. 22 మంది సైనికుల హతం

Balochistan: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. కాగా ఉగ్రదాడి వెనుక దాయాది హస్తం ఉన్నట్టు భారత్ బలంగా ఆరోపిస్తోంది. దాడికి పాక్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి పాల్పడిన వారిని, అందుకు సహకరించిన వారిని వదిలిపెట్టమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పై భారత్ అనేక రకాలుగా చర్యలకు దిగింది. దీంతో పాకిస్తాన్ కు యుద్ధ భయం పట్టుకుంది.
మరోవైపు పాకిస్తాన్ లో నెలకొన్న పరిస్థితులతోపాటు పాకిస్తాన్, బలూచిస్థాన్ మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్ ఆర్మీపై దాడి చేసింది. దాడిలో 22 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చేసిన దాడిలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఆరుగురు చనిపోయారు. కాగా పాకిస్తాన్ లోని కొన్ని పట్టణాల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆక్రమించుకుంది. కలాట్ జిల్లాలోని మంగోచార్ పట్టణంలో పలు భవనాలపై బీఆల్ఏ జెండా ఎగురవేసింది.