Published On:

Iran – Israel War: అణుయుద్దం రానుందా? భయం గుప్పిట్లో ప్రపంచం.! మతాన్ని వాడుకోవాలని చూసిన ఇరాన్

Iran – Israel War: అణుయుద్దం రానుందా? భయం గుప్పిట్లో ప్రపంచం.! మతాన్ని వాడుకోవాలని చూసిన ఇరాన్

Iran – Israel War moving towards Nuclear War: పశ్చిమాసియా పరిణామాలు ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అణు బాంబుల ప్రస్తావన వచ్చింది. ఇజ్రాయెల్ తమపై అణుబాంబులు ప్రయోగిస్తే, పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందన్నారు ఇరాన్ టాప్ మిలటరీ ఆఫీసర్ మెహసిన్ రెజాయ్.

 

అణు యుద్ధం..!! ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నా యావత్ ప్రపంచాన్ని వణికించే పదం ఇది..! పశ్చిమాసియాలో తాజా పరిణామాలను చూస్తుంటే అణు యుద్ధం వస్తుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ కు చెందిన ఐఆర్ జీసీ జనరల్ మెహసిన్ రెజాయ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ తమపైకి అణు బాంబు ప్రయోగించాలని చూస్తోందని హాట్ కామెంట్స్ చేశారు ఐఆర్ జీసీ జనరల్ మెహసిన్ రెజాయ్.

 

అంతేకాదు ఒకవేళ ఇరాన్ పైకి ఇజ్రాయెల్ అణు బాంబు ప్రయోగిస్తే, పరిణామాలు దారుణంగా ఉంటాయన్నారు మెహసిన్ రెజాయ్. ఇజ్రాయెల్ అణు బాంబుకు కౌంటర్ గా ఇరాన్ తరఫున పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని మెహసిన్ రెజాయ్ వెల్లడించారు. ఈ మేరకు పాకిస్తాన్ నుంచి ఇరాన్ కు స్పష్టమైన హామీ లభించిందని ఆయన వెల్లడించారు. మెహసిన్ రెజాయ్ ఇరాన్ కు చెందిన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో సభ్యుడు కూడా. దీంతో మెహసిన్ రెజాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 

కాగా ఇజ్రాయెల్ విషయంలో ఇస్లామిక్ కార్డ్ ను ఉపయోగించాలని ఇరాన్ భావిస్తోంది. ఇజ్రాయెల్ యూదుల దేశం కాగా ఇరాన్ ఇస్లామిక్ దేశం అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, తుర్కియే, సౌదీ అరేబియా సహా మరికొన్ని ముస్లిం దేశాలు కలసి భారీ ఎత్తున ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని మెహసిన్ రెజాయ్ అభిప్రాయపడ్డారు. అయితే ఆయా దేశాలు…ఇరాన్ సైనిక యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవన్నారు మెహసిన్ రెజాయ్. ఇరాన్ సైనిక యూనిఫామ్ వేసుకోవడానికి మిగతా ఇస్లామిక్ దేశాలు అంగీకరిస్తే, మిడిల్ ఈస్ట్ లో రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయని మెహసిన్ రెజాయ్ పేర్కొన్నారు. అయితే ఇస్లామిక్ ఆర్మీ కి సంబంధించి మెహసిన్ రెజాయ్ వ్యాఖ్యలపై మిడిల్ ఈస్ట్ లోని ఏ ఒక్క ముస్లిం దేశం కూడా స్పందించలేదు.

 

అంతేకాదు ఇజ్రాయెల్ పైకి ఇరాన్ తరఫున పాకిస్తాన్ అణు బాంబు ప్రయోగిస్తుందన్న మెహసిన్ రెజాయ్ వ్యాఖ్యలపై ఇస్లామాబాద్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ సైన్యం కళ్లు తేలేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పైకి అణు బాంబు వేసే దుస్సాహాసానికి పాకిస్తాన్ ఒడి గడుతుందా అనే ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది.

 

రెండో ప్రపంచ యుద్ధంలో అణుయుద్దంతోనే .. ఏకంగా రెండు నగరాలు సర్వనాశనమయ్యాయి. లక్షలాది మంది జీవితాలను చిదిమేశాయి. అణుయుద్ధం ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో…. హిరోషిమా, నాగసాకి నగరాలను చూస్తేనే అర్థమవుతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో న్యూక్లియర్ బాంబుల ప్రయోగం మిగిల్చిన వినాశనం అంతా ఇంతాకాదు. అణుయుద్దం వస్తే…దీటుగా ఎదుర్కోవడానికి అనేక దేశాలు రహస్యంగా అణు ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి.

 

అమెరికా, రష్యా, చైనా..! ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాలలో 90 శాతం అమెరికా, రష్యా దగ్గరే ఉన్నాయి. అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య యుద్ధం వస్తే అది రెండు దేశాలకే పరిమితం కాదు. అంతిమంగా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశముంది. ఏది ఏమైనా అణు యుద్ధం అంటే సర్వ నాశనమే. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయమే లేదు.

 

ఇవి కూడా చదవండి: