Published On:

India – Pakistan ceasefire: పాక్ మినిస్టర్ సంచలన కామెంట్స్.. భారత్, పాక్ కాల్పుల విరమణ 18 వరకే!

India – Pakistan ceasefire: పాక్ మినిస్టర్ సంచలన కామెంట్స్.. భారత్, పాక్ కాల్పుల విరమణ 18 వరకే!

India and Pakistan between ceasefire till may 18: భారత్, పాక్ దేశాల మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది టూరిస్టులు చనిపోయారు. ఈ ఘటనను భారత్ సీరియస్‌గా తీసుకుంది. ఆ వెంటనే పాక్‌పై ప్రతీకార చర్యలు చేపట్టింది.

 

భారత్ చేసిన ప్రతీకార దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సమయంలో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడడంతో పాటు భారత్, పాక్ సరిహద్దు గ్రామాల్లో పాక్ సైన్యం కాల్పులు జరిపి చాలామంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్న సంఘటనలతో కాల్పుల విరమణ జరిగింది.

 

తాజాగా, పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 18 వరకు కొనసాగుతుందని బాంబ్ పేల్చారు. మళ్లీ ఇరు దేశాల మధ్య మరోసారి చర్చలు జరుగుతాయని పార్లమెంట్‌లో మాట్లాడారు.

 

మే 14న భారత్, పాక్ దేశాల డీజీఎంఓల మధ్య హాట్ లైన ద్వారా చర్చలు జరిగాయన్నారు. అయితే సీజ్‌ఫైర్‌ను మే 18వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటివరకు మిలిటరీ టూ మిలిటరీ చర్చలు జరిగినట్లు తెలిపారు. రాజకీయ చర్చల్లో భాగంగా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.