Telangana Govt : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
IAS Officers : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను సర్కారు బదిలీ చేసింది. గురువారం సీఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 33 మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ కలెక్టర్గా దాసరి హరిచందన, రాష్ట్ర ఆయిల్ఫెడ్ ఎండీగా జె.శంకరయ్య, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక్ గోయెల్, గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్ కుమార్, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్, ఎస్సీ అభివృద్ధి కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్ పలు పలువురు బదిలీ అయ్యారు.