Mahesh Babu Latest Look: SSMB29లో మహేష్ బాబు కొత్త లుక్ లీక్ – సింహాన్ని క్లోజప్లో చూస్తున్నట్టే ఉంది..

Mahesh Babu New Look Viral: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎస్ఎస్ఎంబీ29(SSMB29) అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం మహేష్ బ్రేక్ మోడ్లో ఉన్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మూవీ నుంచి కూడా ఆఫీషియల్ అప్డేట్స్. ఇటీవల హిట్ 3 మూవీ ప్రమోషన్స్కి వచ్చిన జక్కన్నను SSMB29కి సంబంధించిన అప్డేట్స్ అడగ్గా.. ఆయన పెదవి విప్పలేదు.
ఈ సినిమా కోసం మహేష్ సరికొత్త లుక్లోకి మారాడు. జుట్టు పెంచి గుబురు గడ్డంతో, జిమ్లో వర్కౌట్ చేసి మరింత ఫిట్ అయ్యాడు. ఇందుకోసం విదేశాల్లో స్పెషల్గా మేకోవర్ అయ్యాడు. ఆయన లుక్ చూసేందుకు ఫ్యాన్స్, ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, మహేష్ మాత్రం తన లుక్ బయట పడపడకుండ జాగ్రత్త పడుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆయన పెద్దగా బయట కనిపించడం లేదు. ఎయిర్పోర్టులో తప్పితే మరెక్కడ మహేష్ దర్శనం ఇవ్వడం లేదు. అక్కడ క్యాప్తో కవర్ చేసేస్తున్నాడు. అయితే తాజాగా మహేష్కి సంబంధించిన లేటెస్ట్ ఫోటో బయటకు వచ్చింది.
మహేష్ బాబు లుక్
ఇక్కడ టి-షర్టు, షాట్లో సింపుల్ లుక్లో దర్శనం ఇచ్చాడు.ఎవరితోనో డిస్కషన్ చేస్తూ కనిపించాడు. పక్కనే ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఉన్నారు. ఇక్కడ మహేష్ పొడవైన జుత్తు, గుబురు గడ్డంతో కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ని ఇలా రిలాక్స్ మోడ్లో కనిపించడం ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుంది. ఇక ఆయన లుక్పై కూడా రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ‘సింహం గర్జించేందుకు సిద్ధంగా ఉంది’, ‘సింహాన్ని క్లోజప్లో చూస్తున్నట్టుంది అన్న’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆయన హెయిర్ స్టైల్, లుక్ని సింహంతో పోలుస్తూ అభిమానులంతా తెగ మురిసిపోతున్నారు.
SSMB29 కథ ఇదే
కాగా యాక్షన్, అడ్వెంచర్గా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను జక్కన్న రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఒడిసాలో జరిగిన షూటింగ్లో వీరిద్దరు జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అక్కడ మహేష్, పృథ్వీరాజ్ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సెట్లోని ఓ సీన్కి సంబంధించిన వీడియో లీక్ అయ్యింది. ప్రియాంక సైతం ఈ షెడ్యూల్లో సందడి చేసింది. ఇక నెక్ట్స్ షెడ్యూల్ నుంచి ఈ సినిమా షూటింగ్ విదేశాల్లోనే జరగనుందని టాక్. ఇందులో మెయిన్ భాగం అంతా అమెరికా అమెజాన్ అడవుల్లో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దుర్గ బ్యానర్లో కేఎల్ నారాయణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.