HC Warns to Hero Vishal: ముప్పై శాతం వడ్డీతో సహా రూ. 21 కోట్లు చెల్లించాల్సిందే.. హీరో విశాల్కు హైకోర్టు షాక్!
Madras High Court warns to Hero Vishal on Lyca Case: ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్తో కోలీవుడ్ హీరో విశాల్కు మధ్య ఆర్థిక లావాదేవిల విషయంలో వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రొడక్షన్ వద్ద రూ.21.29 కోట్లు వడ్డీకి తీసుకున్నాడు. అవి చెల్లించకపోవడంతో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు విచారణకు వెళ్లింది. తాజాగా ఈ కేసు విచారణలో మద్రాస్ హైకోర్టు విశాలకు బిగ్ షాక్ ఇచ్చింది.
వడ్డీతో సహా డబ్బుల చెల్లించాలని ఆదేశించింది. 30 శాతం వడ్డీతో రూ. 21.29 కోట్లు తిరిగి ఇవ్వాలని లైకాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాగా లైకా ప్రొడక్షన్ వద్ద డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఆ సంస్థతో సినిమా చేస్తానని విశాల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ, ఒప్పందం ప్రకారం అతడు ఏ సినిమా చేయలేదని లైకా సంస్థ 2022లో కోర్టును ఆశ్రయించింది. డబ్బు తిరిగి ఇచ్చేవరకు విశాల్ నిర్మించే సినిమాల హక్కులు తమకు చెందే విధంగా తీర్పు ఇవ్వాలని కోర్టుని కోరింది.
ఈ మేరకు హైకోర్టు రూ. 15 కోట్లు డిపాజిట్ చేసి తన ఆస్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. అంతవరకు ఆయన నటించిన, నిర్మించిన సినిమాలు థియేటర్స్, ఓ టీటీల్లో విడదల చేయకూడదంటూ స్టే విధించింది. అయితే, కోర్టు ఆదేశాలను ధిక్కరించాడు. తను నటించిన ‘వీరమె వాగై చూడమ్’ మూవీ హక్కులను లైకాకు బదులు మరో సంస్థకు అమ్మేశాడు. దీంతో విశాల్ కోర్టు తీర్పు ఉల్లంఘించారని లైకా సంస్థ న్యాయాస్థానాన్ని ఆశ్రయించింది.
ఆపై అతడిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేశారు. ఇవాళ జరిగిన విచారణ న్యాయస్థానం విశాల్ మందలించి లైకాకు డబ్బుల తిరిగి చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ముప్ఫై శాతం వడ్డీతో అసలు మొత్తం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయితే విశాల్ తన ఆస్తుల వివరాలను కోర్టు అందజేశాడు. తన వద్ద ఉన్న 3 కార్లు, బైక్తో పాటు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలను సమర్పించాడు. అలాగే తన ఇంటిపై ఉన్ రుణాలకు సంబంధించిన పత్రాలను కూడా అందించాడు.