Published On:

Dhanush-Aishwarya: విడాకులు తర్వాత తల్లిదండ్రులుగా ధనుష్‌-ఐశ్వర్య.. ఒకేఫ్రేంలో మాజీ కపుల్‌, ఆకట్టుకుంటున్న ఫోటో

Dhanush-Aishwarya: విడాకులు తర్వాత తల్లిదండ్రులుగా ధనుష్‌-ఐశ్వర్య.. ఒకేఫ్రేంలో మాజీ కపుల్‌, ఆకట్టుకుంటున్న ఫోటో

Dhanush and Aishwarya Rajinikanth Reunite Photo Goes Viral: తమిళ స్టార్‌ హీరో ధనుష్, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. గత 2022 జనవరిలో వారు విడిపోతున్నామని ప్రకటించగా.. గతేడాది కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే వీరి విడాకులను వారి ఫ్యాన్స్‌ జీర్నించుకోలేకపోతున్నారు. మళ్లీ వారిద్దరు ఒక్కటయితే బాగుండని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ధనుష్‌-ఐశ్వర్యకు సంబంధించిన ఓ ఫోటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కోడుతోంది.

 

ఇందులో వీరిద్దరు జంటగా.. నవ్వుతూ.. హ్యాపీగా కనిపించారు. ఈ ఫోటోను స్వయంగా ధనుష్‌ షేర్‌ చేయడం విశేషం. ఇంతకి అసలు విషయం ఏంటంటే.. విడాకులు సమయంలో ధనుష్‌, ఐశ్వర్యలు తాము భార్యభర్తలుగా విడిపోయినా.. తమ పిల్లలకు మాత్రం మంచి తల్లిదండ్రులుగా ఉంటామని చెప్పారు. చెప్పినట్టుగా తమ కొడుకు గ్రాడ్యూయేషన్‌ డేకు ఇద్దరు హాజరయ్యారు. తల్లిదండ్రులుగా కొడుకున సక్సెస్‌ ఆస్వాదిస్తూ కనిపించారు. తమ పెద్ద కుమారుడు యాత్ర గ్రాడ్యూయేషన్‌ డే సందర్భంగా అతడిని నవ్వుతూ ఆలింగనం చేసుకున్నారు.

 

విడాకులు తర్వాత ఒకే ఫ్రేమ్‌లో వీరిద్దరు కనిపించడంతో అభిమానులంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఇద్దరు ఒకేసారి తమ కుమారుడిని ప్రశంసిస్తూ.. ఆలింగనం చేసుకున్న ఈ ఫోటోలను షేర్‌ చేస్తూ.. “తల్లిదండ్రులుగా మేమిద్దరం చాలా గర్వపడుతున్నాం” అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. దీనికి రెడ్‌ హార్ట్‌ ఎమోజీలను జోడించాడు. ఇదే ఫోటోను రజనీకాంత్‌ షేర్‌ చేస్తూ.. తాతగా మురిసిపోయారు. “నా మనవడు జీవితంలో మొదటి మైలురాయి దాటాడు. కంగ్రాట్స్‌ యాత్ర కన్నా” అని రాసుకొచ్చారు. చాలాకాలం తర్వాత ఐశ్వర్య-ధనుష్‌లను ఒకే ఫ్రేంలో చూడటం.. తల్లిదండ్రులు వారిద్దరు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఫోటో సోషల్‌ మీడియాలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.

 

View this post on Instagram

 

A post shared by Dhanush (@dhanushkraja)

ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ధనుష్‌-ఐశ్వర్యలు 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి లింగ, యాత్ర ఇద్దరు కుమారులు ఉన్నారు. కోలీవుడ్‌ క్యూట్‌ కపుల్లో ఒకటిగా ఉన్న ఈ జంట 2022లో విడిపోతున్నామని ప్రకటించి అందరికి షాకిచ్చారు. 18 ఏళ్ల తమ వైవాహిక బంధాన్ని స్వస్తీ పలుకుతూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ధనుష్‌ నటుడిగా, దర్శకుడిగా కెరీర్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నారు. మరోవైపు ఐశ్వర్య సైతం సినీ రంగంలో దర్శకురాలిగా, నిర్మాతగా రాణిస్తోంది.