Allu Aravind Press Meet: థియేటర్ల వివాదం.. నాకేలాంటి సంబంధం లేదు.. ఆ నలుగురిలో నేను లేను: అల్లు అరవింద్

Allu Aravind Press Meet Over Theatres Issue: టాలీవుడ్లో నెలకొన్న పరిస్థితులు, థియేటర్ల వివాదంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల బంద్ అనేది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. రెండు రోజులు నుంచి ఆ నలుగు, ఆ నలుగురు అంటూ అంటున్నారు. ఆ నలుగురు అంటూ నెగిటివ్ షేడ్స్లో ప్రచారం చేస్తున్నారు. ఆ నలుగురితో నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను అని స్పష్టం చేశారాయన. కోవిడ్ టైంలోనే ఆ నలుగురు వ్యాపారం నుంచి బయటకు వచ్చేశాను అన్నారు.
“తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ కూడా లేదని, ఆంధ్రలో ఉన్నవి కూడా లీజ్కు వదిలేస్తూ వచ్చానన్నారు. ఆంధ్రలో మొత్తం 1500 థియేటర్లు ఉంటే.. తనవి కేవలం 15 లోపే ఉన్నాయన్నారు. అవి కూడా త్వరలోనే తవి కాకపోవచ్చు కూడా అన్నారు. తెలంగాణ ఒకేఒక్క థియేటర్ ఉందని, దాని ఓనర్ ఎవరో కూడా మీకు తెలుసన్నారు. థియేటర్ల వివాదంపై మూడు మీటింగ్స్ జరిగాయని, కానీ ఇందులో ఏ సమావేశానికి తాను వెళ్లలేదన్నారు. నేను మాత్రమే కాదు.. మా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ని కానీ, మరో అసోసియేట్ ప్రొడ్యూసర్స్ ఎవరిని కూడా వెళ్లొద్దని చెప్పాను. నింజాగా స్టాండ్ ఏలోన్ థియేటర్స్కి నిజంగానే కష్టాలు ఉన్నాయి. వాటిపై వచ్చి ఛాంబర్, బిల్డర్ పెద్దలతో చర్చించుకోవాలి. ఆ తర్వాత ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వాలి.
అవన్ని ఫెయిల్ అయితే అప్పుడు థియేటర్లు మూసుకోవాలి. కానీ, ఏం ప్రయత్నం చేయకుండానే థియేటర్లు మూసివేస్తామని ఏకపక్షం నిర్ణయం తీసుకున్నారు. పవన కళ్యాణ్ గారి సినిమా రిలీజ్కి రాబోతుండగా.. థియేటర్లు మూస్తాననడం దుశ్వాహసం.. దానికి మీరు ముందడుకు వెయొద్దు. అది పెద్దవాళ్లైన, చిన్నవాళ్లైనా చెబుతున్నా. అశ్వినీ దత్ గారి సినిమా రిలీజ్ అని రేట్స్ ఇప్పించమని అడగానికి మేము పవన్ కళ్యాణ్ గారిని కలిశాం. అప్పుడే ఆయన హింట్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసారా, ఛాంబర్తో కలిసి ఒకసారి కలవండి ఆయన చెప్పారు. కానీ ఆ తర్వాత దీనిపై స్పందించలేదు. పవన్ కళ్యాణ్ హింట్ చేసిన కూడా అది జరగలేదన్నారు.
“ఎవరో మాట్లాడుతూ.. మాది ప్రైవేట్ వ్యాపారం.. ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. అది తప్పు. ప్రభుత్వంతో సంబంధం లేకపోతే.. రెండు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వాన్ని ఎలా కలిశారు అని ప్రశ్నించారు. ఏ వ్యాపారానికైనా ప్రభుత్వం సంబంధం ఉంటుంది? ప్రభుత్వం మద్దతు కావాలి. వారి కో ఆపరేషన్ లేకపోతే మనలో పెద్దవాళ్లే గత సీఎంను ఎందుకు కలిశారు. కష్టం వచ్చిందనే కదా కలిశారన్నారు. అనంతరం టాలీవుడ్ తీరుపై డిప్యూటీ సీఎం ఆఫీసు నుంచి వచ్చిన ప్రశ్న పత్రాన్ని తాను చదివానన్నారు. మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను. అది చాలా సమర్థనీయంగా ఉంది.. ప్రశ్నలు కరెక్ట్ ఉన్నాయి” అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు.