Published On:

Etala Rajender : ముగిసిన ఈటల రాజేందర్ విచారణ.. 20 నిమిషాలపాటు ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్

Etala Rajender : ముగిసిన ఈటల రాజేందర్ విచారణ.. 20 నిమిషాలపాటు ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్

Etala Rajender : కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీల్లో అవకతవకలపై న్యాయ విచారణ కొనసాగిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో ఈటలను ప్రశ్నించారు. బ్యారేజీల నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. బ్యారేజీల నిర్మాణలకు నిధుల విడుదల, మంత్రి మండలి తీర్మానాలపై కమిషన్ ప్రశ్నించింది.

 

ఇప్పటి వరకు జరిగిన విచారణలో ప్రస్తుత, మాజీ ఈఎన్సీలు, సీఈలు, ఐఏఎస్ అధికారులు ఆర్థిక సంబంధమైన పలు అంశాలపై వాంగ్మూలాలు ఇచ్చారు. వారు పేర్కొన్న అంశాల ఆధారంగా ఆర్థిక సంబంధమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు ఏవైనా చోటు చేసుకున్నాయా, నాడు జరిగిన నిర్ణయాలు ఏమిటి అనే విషయాలపై ఈటలను కమిషన్ ప్రశ్నించింది. మరోవైపు బ్యారేజీలపై విచారణకు 9వ తేదీన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, 11వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.

 

కాగా, ఈటల రాజేందర్‌ను 20నిమిషాలపాటు కాళేశ్వరం కమిషన్ విచారించింది. ఈటలను 24 ప్రశ్నలు అడిగిన జస్టిస్ పీసీ ఘోష్. కేంద్ర జలసంఘం, మహారాష్ట్ర అభ్యంతరాలతో ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చామని ఈటల సమాధానం ఇచ్చారు. నిధులన కోసమే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఈటల వివరించారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే మూడు బ్యారేజీలను నిర్మాణం చేపట్టామని తెలిపారు. అన్నీ కేబినెట్ నిర్ణయం ప్రకారమే జరిగాయని వివరించారు. విచారణలో భాగంగా ఆర్థిక అంశాలపై క్రాస్ ఎగ్జామిన్ చేసినట్లుగా తెలుస్తోంది.

 

ఏడీఎస్‌ఏ ఇచ్చిన నివేదిక ఆధారంగా పలు ప్రశ్నలు అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీషన్ సర్టిఫికెట్, నిధులు, బ్యాంక్ గ్యారంటీల విడుదలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. సుమారు గంటపాటు కొనసాగిన విచారణలో కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈటల రాజేందర్ సమాధానం చెప్పారు. కేబినెట్ నిర్ణయం మేరకే నిధులు విడుదల చేశామని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలయ్యాయని, ఇందులో తన సొంత నిర్ణయాలు లేవని చెప్పినట్లు సమాచారం. ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక అంశాలు తనకు తెలియదని కమిషన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపాటు అనుబంధ ప్రాజెక్టుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు డాక్యుమెంట్లను ఈటల రాజేందర్ కమిషన్‌కు అందజేశారు.

ఇవి కూడా చదవండి: