Published On:

Rajendra Prasad: అది నన్నేంతో బాధించింది – మాటిస్తున్నా.. ఇకపై నా లిమిట్స్‌లో ఉంటా

Rajendra Prasad: అది నన్నేంతో బాధించింది – మాటిస్తున్నా.. ఇకపై నా లిమిట్స్‌లో ఉంటా

Rajendra Prasad About on Ali Controversy: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌ తన వ్యాఖ్యలతో వివాదంలో నిలుస్తున్నారు. ఆ మధ్య డేవిడ్‌ వార్నర్‌ని, ఇటీవల అలీ, రోజాలపై మాటలు తులాడు. మంచి నటుడైన ఆయన నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం, అది ఓ పెద్ద ఈవెంట్‌లో బూతులు మాట్లడడాన్ని నెటిజన్స్‌, ప్రజలు తప్పుబట్టారు. ఈ వివాదంలోపై అలీ సైతం స్పందించారు. ఆయన మంచి నటుడని, ప్రస్తుతం కూతురు చనిపోయిన బాధలో ఉన్నారన్నారు.

 

ఏదో సరదాగా ఆయన మాటలు తులారని, ఇక దీనిని పెద్ద వివాదం చేయొద్దంటూ వీడియో రిలీజ్‌ చేశాడు. రాజేంద్ర ప్రసాద్‌ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకుంటే అది వారి కర్మ అని, తానేం చేయలేనన్నారు. ఇవి నెటిజన్స్‌ మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే తాజాగా తనపై వస్తున్న వ్యతిరేకతపై రాజేంద్ర ప్రసాద్‌ స్పందించారు. ప్రముఖ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ విషయంలో తాను చాలా హార్ట్‌ అయ్యానని, ఇకపై ప్రతి ఒక్కరిని గౌరవంగా పిలుస్తానని అన్నారు.

 

“నేను ఏదో వారితో ఉన్న చనువు సరదాగా అలా అన్నాను. నేను ఎవరినైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ప్రేమతో అన్నానని అలీ వివరణ కూడా ఇచ్చాడు. కానీ వీళ్లకే ఏదో ఇబ్బంది అయ్యింది. నాకు ప్రేమలు పంచుకోవడమే తెలుసు. ఆ మాత్రం సెంటిమెంట్లు లేకపోతే ఇన్నేళ్లు యాక్టర్‌ ఎలా ఉంటాను? ప్రతిసారి విమర్శలు తెలిగ్గా తీసుకున్నాను. కానీ ఈసారి మాత్రం నన్ను చాలా బాధించాయి. జీవితంలో ఇంకెప్పుడూ ఎవరినీ ఏకవచనంతో పిలవకూడదని నిర్ణయించుకున్నా. మీరు అని మాత్రమే సంబోధిస్తాను. దీనిని మా అన్న నందమూరి తారకరామరావు నుంచి నేర్చుకున్నా. ఆయన పిల్లల నుంచి పెద్దల వరకు మీరు, రండి అని మాత్రమే పిలిచేవారు.

 

ఇకపై నేను అలాగే మాట్లాడతాను. నా చివరి శ్వాస వరకు అందరికి మర్యాద ఇచ్చే మాట్లాడతానని మాటిస్తున్నా” అని చెప్పుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్‌డే అంటే అది నా పర్సనల్‌ ఫంక్షన్‌ అనుకున్నాను. అందుకే కెమెరాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. అక్కుడున్న అందరూ నాతో పనిచేసిన వారే. వాళ్లందరిని ఎంతోబాగా పొగిడాను. ఫుల్‌ వీడియో చూస్తే తెలుస్తుంది. చిన్న క్లిప్పింగ్స్‌లో చూస్తే మీకు అర్తం కాదు. అయినా నేటి సోషల్‌ మీడియా యుగంలో పాతరోజుల్లోలాగా ఆత్మీయత చూపించే అవాకశాలు లేకుండపోయాయి. చూపించిన దాన్ని అతి అంటున్నారు. లిమిట్స్‌లో ఉండటం బెటర్‌ అని నేర్చుకున్నా” అంటూ రాజేంద్ర ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు.