Published On:

Chenab Railway Bridge: చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం.. ఆనందంతో ప్రధాని పరుగులు

Chenab Railway Bridge: చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం.. ఆనందంతో ప్రధాని పరుగులు

PM Modi: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్ముకాశ్మీర్ పర్యటనలో భాగంగా రూ. 1486 కోట్లతో చీనాబ్ నదిపై 1.31 కి.మీ. మేర నిర్మించిన వంతెనను ప్రధాని జాతికి అంకితం చేశారు. అలాగే శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఆనందంతో చీనాబ్ రైల్వే వంతెనపై పరుగులు తీశారు. అలాగే రూ. 46 వేల కోట్లతో రాష్ట్రంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ మార్గం ఏర్పాటుతో జమ్ము కాశ్మీర్ ఏరియాలో పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

 

కాగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రధాని జమ్ముకాశ్మీర్ లో పర్యటించడం ఇదే తొలిసారి. దీంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా భద్రతా దళాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. ప్రకృతి విపత్తులు, బలమైన గాలుల నుంచి తట్టుకుని ఈ వంతెన నిలబడగలదు. ఈ వంతెన నిర్మాణంతో ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. కాగా ప్రధాని మోదీతో పాటు జమ్ముకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, అధికారులు ఉన్నారు.