IND vs BAN: బంగ్లా దూకుడికి అడ్డుపడిన వరుణుడు.. నిలిచిన ఇండియా, బంగ్లా మ్యాచ్
ఉత్కంఠబరితంగా సాగుతున్న భారత్, బంగ్లా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్ కు వరుణుడు అడ్డు వచ్చాడు.

IND vs BAN: ఉత్కంఠబరితంగా సాగుతున్న భారత్, బంగ్లా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్ కు వరుణుడు అడ్డు వచ్చాడు. 185 పరుగుల టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా జట్టు ఓపెనర్లుగా నజ్ముల్, లిట్టన్ దాస్ మైదానంలో అడుగుపెట్టారు. 6 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ టీం వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసి 10 రన్ రేట్తో దూసుకపోతోంది. దాస్ కేవలం 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కాగా 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు పూర్తి చెయ్యగా అంతలోనే ఒక్కసారిగా మైదానంలో మేఘం ఉరిమింది. దీనితో మ్యాచ్ నిలిచిపోయింది.
ఇదీ చదవండి: విరాటుడి విశ్వరూపం.. బంగ్లా టార్గెట్ @185